
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎన్నికలు సమీస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఇంటికి ఇవాళ తెలంగాణ బీజేపీ నేతలు వెళ్లారు. బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న హుజురాబాద్ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ పొంగులేటి ఇంటికి లంచ్మీట్కు వెళ్లారు. ఈటలతో పాటు మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పొంగులేటి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలోకి రావాల్సిందిగా వారు పొంగులేటిని ఆహ్వానించారు. ఈ భేటికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరయ్యారు.
Read Also : టీసీఎస్కు బాంబు బెదిరింపు కాల్… బాంబ్ ఉందంటూ అజ్ఞాత వ్యక్తి కాల్
నిన్నటి వరకు పొంగులేటి, జూపల్లి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగగా.. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ అధిష్టానం వారిని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత వారు ఏ పార్టీలోనూ చేరలేదు. దీంతో వారిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పొంగులేటి కీలక నేతగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లోనూ ఆయన ప్రభావం చూపుతారనే టాక్ ఉంది. దీంతో ఆయనకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేరికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. పార్టీలోకి రావాల్సిందిగా ఇవాళ ఆయన్ను ఆహ్వానించారు. అయితే పొంగులేటి, జూపల్లి మాత్రం పార్టీలో చేరికపై ఎటూ తేల్చలేదని తెలిసింది. తమ కార్యకర్తలతో చర్చించి.. రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని వారు ఈటల బృందంతో చెప్పినట్లు సమాచారం.
Also Read : ఆమనగల్లు స్వాతి హాస్పిటల్ లో విషాదం… ఆపరేషన్ వికటించి యువకుడు మృతి
బీజేపీలో చేరాలని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఇక జూపల్లి కృష్ణారావును గతంలోనే ఆహ్వానించారు. మాజీ మంత్రి , డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలు జూపల్లి కృష్ణారావుకు ఫోన్ చేసి పార్టీలో చేరాలని కోరారు. తమ అనుచరులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తానని జూపల్లి గతంలో ప్రకటించారు. గత నెల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాహుల్ గాంధీ టీమ్ సైతం భేటీ అయింది. తమ అనుచరులకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వాలని పొంగులేటి రాహుల్ టీమ్ను కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన స్పందన రాలేదని తెలిసింది. దీంతో ఇవాళ పొంగులేటితో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. అయితే కర్ణాటక ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని బట్టి పొంగులేటి రాజకీయంగా నిర్ణయం తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి :
- ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
- పొంగులేటి ఇంటికి ఈటల.. తనకు సమాచారం లేదన్న బండి.. బీజేపీలో ఏం జరుగుతోంది?
- రీల్స్ కోసం వెర్రి చేష్టలు… గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఎండీ సజ్జనార్
- మేడారం జాతరకు వేళాయే.. తేదీలను ఖరారు చేసిన పూజారులు
- ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా..!
One Comment