Andhra Pradesh

భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన.. ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారబోతోందన్న సీఎం జగన్

క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. మొత్తం 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్‌ లిమిటెడ్‌ నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్‌ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు సీఎం. తారకరామ తీర్ధ సాగరం పనులకు శ్రీకారం చుట్టారు. పెండింగ్‌ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేయనున్నారు. 2024 డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అలాగే చింతపల్లి చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌‌కు శ్రీకారం చుట్టారు.

Read Also : విడాకులను వేడుక చేసుకున్న మహిళ.. విడిపోయిన ఆనందంలో ఫోటోషూట్

పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశామని చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు సీఎం జగన్. ఆ తర్వాత కుట్ర చేసి కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారని.. ఆ అడ్డంకుల్ని దాటుకుని ఇవాళ శంకుస్థాపన చేశామన్నారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్‌ టేక్‌ ఆఫ్‌ అవుతుందన్నారు.వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని.. మొన్నే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది అన్నారు. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగుతాయని.. ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో జాబ్‌ హబ్‌గా మారనుంది అన్నారు. ఉత్తరాంధ్రలోని కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టామని గుర్తు చేశారు.

Also Read : సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. అరగంట తర్వాత ప్రాణాలతో బయటపడ్డ మహిళ

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేశామని.. ఉద్ధానంలో కిడ్నీ రీసర్చ్‌ సెంటర్‌ పనులను పూర్తి చేశామని తెలిపారు.. జూన్‌ నెలలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను జాతికి అంకితం ఇస్తామని ప్రకటించారు. ఇచ్చాపురం, పలాసలకు రక్షిత తాగు నీరు అందిస్తామని.. అలాగే సాలూరులో డ్రైవర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభమవుతుందని మరోసారి ప్రకటించారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవని.. కానీ రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి మొత్తం మారిపోతుందన్నారు. విశాఖలో నేడు అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నామని.. ఈ డేటా సెంటర్‌తో రాస్ట్ర ముఖచిత్రమే మారబోతోందన్నారు.

Read Also : ఆగండి, ముందుంది ముసళ్ల పండగ… మే 8 నుంచి రాష్ట్రంలో అసలు సినిమా

భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు ముఖ్యమంత్రి. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు హడావిడిగా కొబ్బరి కాయలు కొట్టారని.. ఆ తర్వాత సుప్రీం కోర్టు, ఎన్జీటీలలో కేసులు వేసి అడ్డుపడ్డారని విమర్శించారు. మన ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు జగన్. మంచి జరిగిందని భావిస్తే తనను ఆశీర్వదించాలని.. ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే ముందుకు వచ్చే అర్హత ఉందన్నారు. ఇలా చంద్రబాబు నాయుడికి అలా అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఠా దోచుకో, పంచుకో, దాచుకో అనే రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేసిందని.. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్త పుత్రుడు ఎందుకు సహకరిస్తున్నారన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని చెప్పాలన్నారు సీఎం జగన్.

ఇవి కూడా చదవండి : 

  1. అలా చిక్కాడో లేదో.. ఇలా బెయిల్ వచ్చేసింది..!
  2. కేఏ పాల్‌తో మామూలుగా ఉండదు మరి.. అన్నంత పనిచేశారు!
  3. 40 మంది మహిళలకు భర్త పేరు ఒకటే.. విస్తుపోయిన అధికారులు!
  4. చికోటి క్యాసినో భాగోతం.. థాయ్‌లాండ్‌లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు అరెస్ట్
  5. గవర్నర్, ప్రభుత్వానికి మధ్య మరో పంచాయతి… సచివాలయ ప్రారంభోత్సవ ఆహ్వానంపై రాజ్‌భవన్ క్లారిటి

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.