
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దూకుడు పెంచారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించకుండా అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల్లో నడవడం లేదని.. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని పిల్లో ప్రస్తావించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ప్రజలతో పాటు అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు సంబంధించి.. గ్లోబల్ పీస్ ఆర్గనైజేషన్ ద్వారా విరాళాలు సేకరించేందుకు అనుమతించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. పార్టీ ఇన్ పర్సన్లా పిల్ వేసిన పాల్.. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలువరించాలని కోరారు.
Read Also : గద్వాల వాసికి అరుదైన అవకాశం… నూతన సచివాలయానికి తొలి సీఎస్వోగా కీలక బాధ్యతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ బ్యాలెన్స్ షీట్, లాభనష్టాలను పరిశీలించేందుకు తెలుగు తెలిసిన రిటైర్డ్ జడ్జిని నియమించేలా ఆదేశించాలని పిల్లో కోరారు. స్టీల్ ప్లాంట్ విక్రయానికి సంబంధించి తనకు సమాచారం ఉందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను నిలువరించేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు పాల్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నామమాత్రపు ధరకు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని.. విరాళాలు సేకరిస్తామని, విశాఖ ఉక్కును కాపాడడానికి అందరు కలిసిరావాలని కోరారు. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు పాల్. ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిల్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ దాన్ని తిరస్కరిస్తే ఆమరణ దీక్ష తప్పదన్నారు.
Also Read : వందేళ్లు వర్థిల్లే ఉప్పల్ స్కైవాక్… త్వరలో ప్రారంభానికి సిద్ధం
విశాఖ ఉక్కును కాపాడేందుకు తనవంతుగా రూ.4 వేల కోట్లు సాయం అందిస్తాననిచెప్పారు. కేంద్రం అనుమతిస్తే విదేశాల నుంచి ఫండ్స్ తెస్తాను అన్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. తనకు అవకాశం ఇస్తే రాష్ట్రాల అప్పులు తీర్చేస్తాను అన్నారు. ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తెస్తే ప్రతి గ్రామానికి రూ. కోటి నిధులు ఇస్తానని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపిస్తాను అన్నారు. రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారని.. అందుకే అందరూ తమ పార్టీవైపు చూస్తున్నారని.. పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ తీరుతో దేశ ప్రజలు విసిగిపోయారన్నారు. దేశంలో అవినీతి లేని రాజ్యాన్ని స్థాపించాలన్నారు పాల్. తన పార్టీని ప్రజలే నడిపించాలని.. అందుకే తాను ప్రజలను విరాళాలు కోరుతున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- మహారాష్ట్రపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్… త్వరలో 12 లక్షల మందితో భారీ కిసాన్ ర్యాలీ!
- ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మావోల దుశ్చర్య… 10 మంది జవాన్ల మృతి
- ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్… రైతులు ఆదుకోవటంలో విఫలమైందని మండిపాటు
- కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అందరి ఫోకస్ రైతులపైనే!!
- 40 మంది మహిళలకు భర్త పేరు ఒకటే.. విస్తుపోయిన అధికారులు!