MahabubabadTelangana

పొంగులేటి ఎఫెక్ట్.. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్!

క్రైమ్ మిర్రర్, ఖమ్మం ప్రతినిధి : మాజీ ఎం‌పి, ఖమ్మం జిల్లాకు చెందిన కీలక రాజకీయ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇటీవలె సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై, ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ప్రజలను మోసం చేశారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తుూ వచ్చారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన్ను అధిష్ఠానం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన అనుచరులు కూడా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. తాజాగా.. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలింది.

Read Also : కేఏ పాల్‌తో మామూలుగా ఉండదు మరి.. అన్నంత పనిచేశారు!

బీఆర్ఎస్ పార్టీకి చెందిన గార్ల జడ్పీటీసీ సభ్యురాలు జాటోత్ ఝాన్సీలక్ష్మీ పార్టీకి రాజీనామా చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆమెతో పాటు మరో 30 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడైన మాజీ ఎంపీ పొంగులేటికి.. బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం లభించలేదని ఝాన్సీ అన్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు. ఖమ్మం జిల్లాలో చాలా నియాజవర్గాలను ఆయన ప్రభావితం చేయగలరనే టాక్ ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు ఆయనకు గాలం వేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు వైఎస్సా‌ఆర్‌టీపీ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది.

Also Read : గద్వాల వాసికి అరుదైన అవకాశం… నూతన సచివాలయానికి తొలి సీఎస్‌వోగా కీలక బాధ్యతలు

కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ.. ఆయనతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను రంగంలోకి దింపేందుకు యత్నిస్తుందని సమాచారం. అయితే తాను ఏ పార్టీలో చేరే విషయమై పొంగులేటి ఇప్పటి వరకు ఓ క్లారిటీకి రాలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పొంగులేటి.. బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేయటమే తమ ఏకైక లక్ష్యమని అన్నారు. అందుకు ఏ పార్టీ అయితే సరైందో ఆ పార్టీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. బీఆర్ఎస్‌ను ఇంటికి పంపి. మరోసారి జనాలను మోసం చేయకుండా ఉండే పార్టీలోనే తాను కలుపుతానని చెప్పారు. కానీ ఏ పార్టీలే చేరే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి : 

  1. వందేళ్లు వర్థిల్లే ఉప్పల్ స్కైవాక్… త్వరలో ప్రారంభానికి సిద్ధం
  2. మహారాష్ట్రపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్… త్వరలో 12 లక్షల మందితో భారీ కిసాన్ ర్యాలీ!
  3. కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అందరి ఫోకస్ రైతులపైనే!!
  4. ఎన్నికల వేళ తెలంగాణలో టీడీపీ బిగ్ ప్లాన్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ సభలు
  5. సుదర్శనయాగం, పూర్ణాహుతి, గ్యాదరింగ్.. కొత్త సచివాలయం ప్రారంభోత్సవ వేడుకలు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.