National

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మావోల దుశ్చర్య… 10 మంది జవాన్ల మృతి

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు అదునుచూసి ఘాతుకానికి పాల్పడ్డారు. ఐఈడీ బాంబు పేల్చి 11 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 10 మంది డీఆర్జీ జవాన్లు, ప్రైవేట్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన ఆర్మీ వర్గాలను, ప్రభుత్వాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బుధవారం (ఏప్రిల్ 26) మధ్యాహ్నం జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును లక్ష్యంగా చేసుకొని నక్సల్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పేలుడు దాటికి జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సు తునాతునకలైంది. జవాన్ల శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో భారీ గొయ్యి ఏర్పడింది. రక్తపు మరకలు, తెగిపడిన శరీర భాగాలతో ఘటనా స్థలం భీతావహంగా మారింది.

Read Also : తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది… ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ అణచివేత కార్యకలాపాల నిమిత్తం ‘డిస్ట్రిక్స్ రిజర్వ్ గార్డ్’ (DRG) బృందాలను ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కొంత మంది జవాన్లతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఒక బృందం.. దంతేవాడ జిల్లాలోని అరన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలకు సంబంధించిన సమాచారంతో బుధవారం ఉదయం కూంబింగ్‌‌కు వెళ్లింది. అనంతరం తిరిగి తమ స్థావరానికి వస్తుండగా నక్సల్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ పోరాటం చివరి దశలో ఉంది. మావోయిస్టులను విడిచిపెట్టేదిలేదు’ అని ఆయన అన్నారు.

Also Read : ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్… రైతులు ఆదుకోవటంలో విఫలమైందని మండిపాటు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సీఎం బఘెల్‌తో మాట్లాడారు. పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జవాన్లను లక్ష్యంగా చేసుకొని నక్సల్స్ కొంత కాలంగా ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో రోడ్ల వెంట ఐఈడీ బాంబులను పాతిపెడుతున్నారు. అలాంటి ఐఈడీ బాంబులను జవాన్లు పెద్ద సంఖ్యలో వెలికితీశారు. బాంబులను గుర్తించేందుకు ప్రత్యేక పద్ధతులు, టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అయితే, చాలా కాలం తర్వాత నక్సల్స్‌తో భద్రతా దళాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

ఇవి కూడా చదవండి : 

  1. కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అందరి ఫోకస్ రైతులపైనే!!
  2. అన్నదాతలు అధైర్య పడొద్దు… పంట నష్టపోయిన రైతులకు మంత్రి హరీశ్ భరోసా
  3. 40 మంది మహిళలకు భర్త పేరు ఒకటే.. విస్తుపోయిన అధికారులు!
  4. మహేష్ హత్య కేసులో ట్విస్ట్.. కలకలం రేపుతోన్న యువతి వీడియో
  5. దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.