
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : అసలే ఎండలు.. వేడికి మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. అత్యవసరమైతే తప్ప చాలామంది ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు రావడం లేదు. దీంతో రోడ్లపై జనసంచారం కాస్త తగ్గింది. ఎండకు తోడు వడగాల్పుల తీవ్రత పెరగడంతో.. ప్రజలు బయటకు రావడం చాలావరకు తగ్గింది. ఎండల నుంచి ఉపశమనం పొందటానికి శీతల పానియాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎండల ప్రతాపంతో బీర్ల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉండటంతో.. శరీరంలో వేడి తగ్గేందుకు, ఉపశమనం కోసం మందుబాబులు చిల్ బీర్లు తాగుతున్నారు. దీంతో తెలంగాణలో ఈ నెలలో బీర్ల అమ్మకాలు రికార్డు స్ధాయిలో పెరిగిపోయాయి.
Read Also : “ముసలావిడే కానీ మహాముదురు”… కట్టుకథ చెప్పి ఫిర్యాదు… దర్యాప్తు చేపట్టగా వెలుగులోకి అసలు నిజం
ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్లో దాదాపు 1.01 కోట్ల బీర్లు అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్శాఖ గణాంకాలు చెబుతన్నాయి. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి 8,46,175 కేసుల బీర్లను విక్రయించారు. ఒక కేసులో 12 బీర్లు ఉంటాయి. దీనిని బట్టి చూస్తే భారీ స్థాయిలో బీర్లు అమ్ముడుపోయాయి. ఈ నెలలో ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి రోజుకు సగటున 6 లక్షల బీర్లు అమ్ముడుపోయాయి. ఎండలతో మార్చి నుంచే బీర్ల అమ్మకాల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఏప్రిల్లో ఈ నెల 17వ తేదీ వరకు హైదరాబాద్లో 1,94,351 కేస్లు, రంగారెడ్డి జిల్లాలో 5,59,5746 కేస్ల బీర్లు, మేడ్చల్ జిల్లాలో 92,078 కేస్ల బీర్లను విక్రయించారు. ఇక మార్చిలో హైదరాబాద్ జిల్లా పరిధిలో 3,68,569 కేస్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 10,77,240 కేస్లు, మేడ్చల్ జిల్లా పరిధిలో 1,63,358 కేస్ల బీర్లు అమ్ముడుపోయాయి.
Also Read : డివిజన్ ఎస్సీ మోర్చా ఆద్వర్యంలో శానిటేషన్ వర్కర్లకి శాలువా సన్మానం..
అలాగే ఫిబ్రవరి విషయానికొస్తే హైదరాబాద్ పరిధిలో 3,31,784, రంగారెడ్డి పరిధిలో 9,34,452, మేడ్చల్ పరిధిలో 1,46,763 కేస్ల బీర్లను విక్రయించారు. ఇక జనవరిలో హైదరాబాద్ జిల్లాలో 2,96,619 కేస్లు, రంగారెడ్డి జిల్లాలో 8,36,907 కేస్లు, మేడ్చల్ జిల్లాలో 1,34,468 కేస్ల బీర్లు అమ్ముడుపోయాయి. మద్యం అమ్మకాలు పెరగడంతో ఎక్సైజ్శాఖకు భారీగా ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రానున్న కొద్దిరోజుల్లో మరింతగా పెరిగే అవకాశముంది. వడగాల్పులు కూడా తీవ్రంగా వీచే అవకాశముంది. దీంతో బీర్ల అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశముందని ఎక్సైజ్శాఖ అంచనా వేస్తోంది. దీంతో డిమాండ్కు తగ్గట్లు వైన్ షాపులకు బీర్లను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తోంది. ఈ నెల, వచ్చే నెలలో బీర్ల అమ్మకాలు రికార్డు సృష్టించే అవకాశముందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్లో ఐపీఎల్ బెట్టింగ్… నలుగురు వ్యక్తులు అరెస్ట్, 46 లక్షలు సీజ్
- బంజారాహిల్స్ స్కూల్ ఘటన దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష… సంచలన తీర్పు వెలువరించిన నాంపల్లి ఫాస్ట్ ట్రాక్కోర్టు
- ఆ చిన్నారి పూర్తి బాధ్యత నాదే.. మరోసారి మంచి మనసు చాటుకున్నకోమటిరెడ్డి
- చౌటుప్పల్లో వంద పడకల ఆసుపత్రికి మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి భూమిపూజ…
- కన్న తల్లిన చంపిన కసాయి కొడుకు… వృద్ధాప్యంలో సపర్యలు చేయలేక ఘాతుకం
One Comment