NationalTelangana

ప్రధాని మోదీతో కోమటిరెడ్డి భేటీ… పార్టీ మార్పు ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యుహాలు రచిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేతలు కూడా తమ రాజకీయ భవిష్యత్తుపై ఓ అంచనాకు వస్తూ కలిసొచ్చే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పీసీసీ పదవితో పాటు కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన పార్టీ అంతర్గత కమిటీల్లోనూ ప్రాధాన్యత దక్కపోవటంతో కోమటిరెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

Read Also : అన్నదాతకు అండగా ఉంటాం… పంట నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్

పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనటంలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగిన సమయంలోనూ ఆయన పాల్గొనలేదు. దీనికి తోడు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఆయన తమ్ముడు, బీజెపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తమ్ముడి బాటలోనే ఆయన కూడా బీజేపీలో చేరనున్నాడనే ప్రచారం జరిగింది. గతంలోనూ ఓ సారి ప్రధాని మోదీతో భేటీ అయిన కోమటిరెడ్డి.. నియోజవర్గ సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకే మోదీని కలిసానని చెప్పారు. కానీ ఈ సారి మాత్రం.. మోదీతో భేటీ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

ఎన్డీయే ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కామెంట్స్ చేశారు. జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే నెట్ వర్క్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, టెక్స్ టైల్ పార్కులు, మెట్రో రైల్ కనెక్టివిటీ ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని కొనియాడారు. హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ ఫేజ్ – 2 ప్రాజెక్టును ఘట్ కేసర్ నుంచి ఆలేరు, జనగాం వరకు పొడిగించాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారాయి. ఆయన పార్టీ మారేందుకే ప్రధాని మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తారని పలువురు అభిప్రాయపడుతన్నారు. పార్టీ మార్పుపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అందులో భాగంగానే కోమటిరెడ్డి ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. మరి నిజంగా ఆయన పార్టీ మారుతారా ? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా ? అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి : 

  1. నేడు నాలుగు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన… నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్న కేసీఆర్
  2. నేడు సిట్ ఎదుటకు టీపీపీసీ రేవంత్… TSPSC పేపర్ల లీక్ ఆరోపణలపై వివరణ
  3. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు… మరో నాలుగు పరీక్షలు వాయిదా ?
  4. తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు.. విచారణ ఈ నెల 27కు వాయిదా
  5. సిట్ కు ఆ దమ్ముందా?… లాజిక్ తో కొట్టిన బండి సంజయ్!!

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Continue in browser
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
Crime Mirror
To install tap Add to Home Screen
Add to Home Screen
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.