
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఎస్పీఎస్సీ పేపర్ లిక్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు సిట్ ఎదుట హాజరైన టీపీసీసీ రేవంత్ రెడ్డి తమకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఓకే మండలంలో వంద మంది వందకుపైగా మార్కులు తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలి అంటూ సిట్ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి సిట్ కార్యాలయానికి ఈరోజు వెళ్లారు. కానీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు మాత్రం సమర్పించలేదని సిట్ అధికారులు వెల్లడించారు.
Read Also : బస్సులోనే సీఎం కేసీఆర్ భోజనం… వడ్డించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు సిట్ అధికారులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. సిట్ విచారణ తర్వాత బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తన వద్ద ఉన్న ఆధారాలన్ని అధికారులకు ఇచ్చానని తెలిపారు. నిందితుడు ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన వ్యక్తి అని ఆరోపించారు. 60 ఏండ్ల పోరాటాన్ని, 1200 మంది విద్యార్థుల బలిదానాలను, 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును రాజమండ్రికి చెందిన ప్రవీణ్ కుమార్ చేతిలో కేసీఆర్ పెట్టడన్నారు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకొని 9 సంవత్సరాలు గడిచినా.. తెలంగాణకు చెందిన వ్యక్తి కంప్యూటర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేయడానికి పనికిరాడన్నారు.
Also Read : ప్రధాని మోదీతో కోమటిరెడ్డి భేటీ… పార్టీ మార్పు ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు
జరిగిన నష్టాన్ని విచారణ చేయడానికి తెలంగాణకు చెందిన అధికారి లేడన్నారు. తెలంగాణకు చెందిన నిజాయితీ గల అధికారులు ఎందరో ఉన్నారని.. కానీ టీఎస్పీఎస్సీ కేసును విచారిస్తున్న సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ విజయవాడకు చెందిన వ్యక్తి అని ఆరోపించారు. ఆనాడు కేసీఆర్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సమైక్య పాలనలో తెలంగాణకు చెందిన వ్యక్తి అడ్వొకేట్ జనరల్గా లేడన్నారు. టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేయడానికి తెలంగాణ బిడ్డ లేడా.. అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లో సెట్ అధికారులు ఇప్పుడు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగిని షమీతో పాటు మరో ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. టీఎస్సీపీఎస్సీ మెంబర్ దగ్గర పనిచేస్తున్న రమేష్ను అధికారులు అరెస్టు చేశారు. అలాగే టీఎస్పీఎస్సీ ఉద్యోగి సురేష్ను అరెస్టు చేశారు. సురేష్ అనే వ్యక్తి ప్రవీణ్ కుమార్కి సన్నిహితంగా ఉంటూ పేపర్ని కొట్టేసినట్టు అధికారులు తెలిపారు. గ్రూప్ వన్ పేపర్ లీక్లో సురేష్, రమేష్ ఇద్దరు కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు సురేష్, రమేష్లను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో అధికారులు 12 మందిని అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి :
- అన్నదాతకు అండగా ఉంటాం… పంట నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్
- 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
- నేడు నాలుగు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన… నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్న కేసీఆర్
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు… మరో నాలుగు పరీక్షలు వాయిదా ?
One Comment