
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఓ వైపు ఢిల్లీలో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరైన వేళ.. ఇటు హైదరాబాద్లోనూ ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న చేపట్టిన దీక్షలో భాగంగా మాట్లాడిన బండి సంజయ్.. కవిత అరెస్టుకు సంబంధించి ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డెక్కారు.
Read Also : కవిత ఈడీ విచారణ వేళ సీఎం కేసీఆర్ అలర్ట్… ప్రగతిభవన్ నుంచే ఆరా తీస్తున్న గులాబీ బాస్
బీఆర్ఎస్ పార్టీలోని మహిళా నేతలంతా నిరసనలో పాల్గొంటూ.. బండి సంజయ్ దిష్టి బొమ్మలను దహానం చేశారు. అటు తెలంగాణ భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున నేతలు, మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్ వెంటనే ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలంటూ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు పంజాగుట్టలో, ఇటు బీఆర్ఎస్ కార్యాలయం ఎదుటే కాకుండా.. అటు ఢిల్లీలోనూ తీవ్ర ఆందోళనకు దిగారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మాలోతు కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి.. ఓ మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయటంమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బెదిరింపులు… బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నోటికి హద్దు అదుపు లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని.. తీరు మార్చుకోకపోతే మెంటల్ ఆస్పత్రిలో చేర్చి ట్రిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించారు. అటు హైదరాబాదులోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈడీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ముందుగానే పోలీసులు ఈడీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున మోహరించారు. బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తారనే నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఈడీ కార్యాలయం వద్దకు బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- త్వరలో బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి… హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు
- పెద్ద పేపర్ల పేరుతో వసూళ్ల దందాలు…. మండలంలో జరుగుతున్న భూ వ్యవహారంలో వారిదే కీలక పాత్ర..
- ఆలయాల దగ్గర రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు… వీరేందర్ గౌడ్
- ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవిత… కేసీఆర్ నివాసం వద్ద టెన్షన్
- ముందస్తు ఎన్నికలుండవని మరోసారి స్పష్టం చేసిన కేసీఆర్…