
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు సంబంధించిన పరిణామాలను హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచే కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నేతలకు ఫోన్ చేసి ఢిల్లీలోని పరిణామాలపై ఆరా తీస్తున్నారు. కవిత ఈడీ విచారణ, అరెస్ట్ జరిగితే ఏం చేయాలనే దానిపై ప్రగతిభవన్లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ ఢిల్లీకి పంపించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి బయర్దేగా.. కాసేపట్లో మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే కవిత అరెస్ట్ జరిగితే ఏం చేయాలనే దానిపై ఇప్పటికే కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారు.
Read Also : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బెదిరింపులు… బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఢిల్లీలో పెద్దఎత్తున నిరసనలు చేయాలని నిర్ణయించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఈడీ ఆఫీస్ ఎదుట బైఠాయించనున్నారు. ఆప్ మద్దతుతో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ఆప్ నేతలతో బీఆర్ఎస్ నాయకులు చర్చలు జరుపుతున్నారు. కవిత విచారణ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Also Read : త్వరలో బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి… హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు
అందలో భాగంగా హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఢిల్లీలో కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. వివిధ అంశాలపై ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో నలుగురు సభ్యులు బృందం కవితను ప్రశ్నిస్తోంది. ఈ బృందంలో మహిళా అధికారి కూడా ఉన్నారు. రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబులతో కలిసి కవితను ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 11 గంటలకు కవిత ఈడీ విచారణ ప్రారంభమవ్వగా.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే కవిత విచారణను వీడియో షూట్ కూడా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- పెద్ద పేపర్ల పేరుతో వసూళ్ల దందాలు…. మండలంలో జరుగుతున్న భూ వ్యవహారంలో వారిదే కీలక పాత్ర..
- ఆలయాల దగ్గర రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు… వీరేందర్ గౌడ్
- ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవిత… కేసీఆర్ నివాసం వద్ద టెన్షన్
- ముందస్తు ఎన్నికలుండవని మరోసారి స్పష్టం చేసిన కేసీఆర్…
- ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం…