
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. 9న తనను విచారణకు రమ్మన్నారని.. కానీ 11న తాను వస్తానని చెప్పినట్టు వెల్లడించారు. ఈడీ విచారణను ఎదుర్కొంటానని.. ఈడీ అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తానని కవిత స్పష్టం చేశారు. భయమెందుకు? నేనేం తప్పు చేయలేదని.. విపక్షాల మాట కూడా వినాలని కవిత వ్యాఖ్యానించారు. తనతోపాటు ఎవర్ని విచారించినా ఇబ్బంది లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ‘దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికొచ్చి విచారించాలని చట్టం చెబుతోంది. దర్యాప్తు సంస్థలు మహిళల్ని విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం.
Read Also : ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్న యువకుడు… ముహూర్తానికంటే ముందే పెళ్లి తంతు
ఈడీ ఎందుకింత హడావిడిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరు? కావాలంటే నిందితుల్ని ఇంటికి తీసుకొచ్చి విచారించమని కోరా. కానీ ఈడీ మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తా. తెలంగాణ నేతల్ని వేధించడం కేంద్రానికి అలవాటైపోయింది. నిందితులతో కలిపి ప్రశ్నించాలనుకుంటే.. నన్ను వీడియో కాన్ఫరెన్స్లో విచారించండి’ అని కవిత వ్యాఖ్యానించారు. ’27 ఏళ్లుగా మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతోంది. రాజ్యసభలో మహిళా బిల్లు తెచ్చిన సోనియాకు సెల్యూట్.
Also Read : కొనసాగుతున్న ఆపరేషన్ మదర్ టైగర్… అటవి అధికారుల తీవ్ర ప్రయత్నం
మహిళా బిల్లు కోల్డ్ స్టోరేజ్లో ఉంది. 10న జంతర్మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం ధర్నా చేస్తున్నాం. అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014, 2018లో మోదీ మాటిచ్చారు’ అని కవిత వ్యాఖ్యానించారు. అయితే.. జంతర్ మంతర్ వద్ద కవిత తలపెట్టిన దీక్షకు పోలీసులు షరతులు విధించారు. కవిత మీడియాతో మాట్లాడుతుండగానే.. ఢిల్లీ పోలీసులు వచ్చి ఈ విషయాన్ని చెప్పారు. వేరేవారు కూడా అనుమతి కోరారని.. అందుకే సగం స్థలం మాత్రమే వాడుకోవాలని సూచించారు. ముందే అనుమతి తీసుకున్నా.. ఇప్పుడు ఇలా చేయడం ఏంటని కవిత ప్రశ్నించారు. కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్ దాఖలు…
- ఎంఎల్సి కవిత లేఖపై స్పందించిన ఈడీ… 11న విచారణకు ఒకే
- మహేశ్వరం పొలీస్ స్టేషన్ల్ ఘనంగా మహిళా దినోత్సవం.. మహిళ పోలీసులను సన్మానించిన సి ఐ
- ఫోన్ మాట్లాడుతూనే కుప్పకూలిన యువకుడు… అక్కడికక్కడే మృతి