
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు నామినేషన్ లు దాఖలు చేశారు. గురువారం ఉదయం దేశపతి శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, నవీన్ కుమార్ నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్ సందర్బంగా మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హాజరయ్యారు. మరోవైపు నేడు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం తరువాత అభ్యర్డుల ఫైల్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్దకు వెళ్లనుంది. ఇక, ఎమ్మెల్సీలు డీ. రాజేశ్వరరావు, ఫారూక్ హుస్సేన్ పదవీకాలం ముగియనుంది. ఈ ఇద్దరిలో ఒకరు క్రిస్టియన్ మైనారిటీ కాగా మరొకరు ముస్లిం మైనార్టీ.
Read Also : ఎంఎల్సి కవిత లేఖపై స్పందించిన ఈడీ… 11న విచారణకు ఒకే
ఈనేపధ్యంలో సిఎం కేసిఆర్ మరోసారి మైనార్టీకే అవకాశం ఇవ్వాలనుకుంటే రాజేశ్వర్ రావు వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఉదంతం కారణంగా ఈసారి అధికార పార్టీ అభ్యర్ది ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటునట్లు సమాచారం. ఇదిలా ఉండగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్, పీఎల్. శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ముగ్గురు ఓసి సామాజికవర్గానికి అవకాశం ఇచ్చినందున గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా బీసి, ఇతర సామాజిక వర్గాలతో భర్తీ చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- మహేశ్వరం పొలీస్ స్టేషన్ల్ ఘనంగా మహిళా దినోత్సవం.. మహిళ పోలీసులను సన్మానించిన సి ఐ
- ట్యాంక్బండ్ వద్ద వైఎస్ షర్మిల అరెస్ట్… బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలింపు
- ఫోన్ మాట్లాడుతూనే కుప్పకూలిన యువకుడు… అక్కడికక్కడే మృతి
- రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి…
- ఒకే ముహూర్తంలో ఇద్దరిని పెళ్లి చేసుకోనున్న యువకుడు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత పెళ్లి