
క్రైమ్ మిర్రర్, భద్రాద్రి కొత్తగూడెం : వరుడు ఒక్కడే.. కానీ వధువులు ఇద్దరు. పెళ్లి ముహూర్తం కూడా ఒక్కటే. ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టి పెళ్లి చేసుకోనున్నాడు ఓ వ్యక్తి. ఈ పెళ్లికి వరుడి కుటుంబంతో పాటు వధువుల కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలపడం మరో విశేషం. అంతేకాదండోయ్.. పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేయించి బంధువులు, స్నేహితులను కూడా పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Read Also : తెలంగాణలో పూటకో హత్య, గంటకో రేప్… రేపిస్టులంతా బీఆర్ఎస్లోనే… బండి సంజయ్
1954లో ఎన్టీఆర్ హీరోగా జమున, లక్ష్మికాంతంలు హీరోయిన్లుగా నటించిన ‘ఇద్దరు పెళ్ళాలు’ సినిమాను కొంతమంది గుర్తు చేస్తున్నారు. ఆ సినిమాను తలపించేలా ఇది ఉందని వెడ్డింగ్ కార్డు చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్య, రామలక్ష్మి దంపతుల కుమారుడు సత్తిబాబు ఒకేసారి ఇద్దరిని పెళ్లాడబోతున్నట్లు వెడ్డింగ్ కార్డులో కనిపిస్తుంది. చర్ల మండలంలోని దొసిళ్లపల్లి గ్రామానికి చెందిన సోడి వెంకటేశ్వర్లు, సమ్మక్క దంపతుల కుమార్తె స్వప్నకుమారి, అదే మండలంలోని కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్ప సత్యనారాయణ, రుక్మిణి దంపుతుల కుమార్తె సునీతలను సత్తిబాబు పెళ్లాడనున్నట్లు ఆహ్వాన పత్రికలో ఉంది. వరుడి స్వగ్రామమైన ఎర్రబోరులో గురువారం ఉదయం 7.04 గంటలకు విహహం జరగనున్నట్లు పెళ్లి పత్రికలో కనిపిస్తుంది. ఒకే వ్యక్తి ఇద్దరిని ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకుంటుండటంతో ఇది వైరల్గా మారింది.
Also Read : ప్రజలనే కాకుండా దేవుళ్ళను మోసం చేస్తున్న కేసిఆర్ కుటుంబం… రేవంత్ రెడ్డి
అయితే ఇలా చేసుకోవడం వెనుక ఒక కారణం వినిపిస్తోంది. సత్తిబాబు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. సునీత, స్వప్న కుమారి అనే ఇద్దరి అమ్మాయలను ప్రేమించాడు. స్వప్నతో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు భావించగా.. సునీతకు ఈ విషయం తెలిసి ప్రియుడిని నిలదీసింది. దీంతో సంవత్సరం క్రితం నుంచి స్వప్న, సునీత ఇద్దరితో కలిసి సత్తిబాబు తన ఇంట్లో కాపురం చేస్తున్నాడు. అలాగే వారిద్దరికి ఒక్కో సంతానం కూడా జన్మించారు. అయితే సత్తిబాబు కోయ గిరిజన తెగకు చెందినవాడిగా తెలుస్తుంది. ఆ తెగకు చెందినవారు కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. సత్తిబాబుకు ఏడాది కాపురం చేసిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అందుకే ఇప్పుడు బంధువులు, కుటుంబసభ్యులందరి సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కారణం తెలుసుకుని కొంతమంది ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- కరవమని కుక్కలకు నేను చెప్పానా… మేయర్ విజయలక్ష్మి అసహనం
- ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్… మంత్రి హరీశ్ రావు
- చెరుకు సుధాకర్ను ఉద్దేశపూర్వకంగా ఫోన్లో తిట్టలేదు… కోమటిరెడ్డి వివరణ
- బాణా సంచా తయారుచేస్తుండగా ప్రమాదం… ఐదుగురి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
- టిడిపి, జనసేన పొత్తులపై నారా లోకేష్ సంచలన వ్యాక్యలు…