
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై టీపీసీసీ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. జగిత్యాల జిల్లా చొప్పదండిలో హథ్ సే హాథ్ పాదయాత్ర కొనసాగించిన రేవంత్.. ముందుగా కొండగట్టు అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసిఆర్ కుటుంబం మెుత్తం ప్రజా దోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కొండగట్టును అభివృద్ధి చేస్తానని అబద్ధపు వాగ్ధానాలతో సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసి..125 అడుగుల విగ్రహం కట్టిస్తానని సీఎం కుమార్తె కవిత మోసం చేశారని మండిపడ్డారు.
Read Also : కరవమని కుక్కలకు నేను చెప్పానా… మేయర్ విజయలక్ష్మి అసహనం
తండ్రి, కుమారుడు, కూతురు కుటుంబం మెుత్తం దేవుళ్లను మోసం చేసి పబ్బం గడుపుతున్నారని ఆక్షేపించారు. కొండగట్టు బస్సు బాధిత కుటుంబాలను ఆదుకోవటంతో పాటు.. ఆలయ అభివృద్ధికి తక్షణమే రూ. 500 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొండగట్టులో ప్రత్యేక పూజల అనంతరం రేవంత్.. పోతారం రిజర్వాయర్ను పరిశీలించారు. భూ నిర్వాసితుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం భూ నిర్వాసితులకు పరిహారం అందిచంట లేదని ఆయన ధ్వజమెత్తారు. “పోతారం చెరువు బ్యాక్ వాటర్ వల్ల సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలంలో రాకపోకలకు ఇక్కడి గ్రామాల ప్రజలకు అంతరాయం ఏర్పడుతోంది.
Also Read : బాణా సంచా తయారుచేస్తుండగా ప్రమాదం… ఐదుగురి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కొనాపూర్లో 135 కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలేదు. మత్తడి నిర్మాణం పూర్తి కాలేదనే సాకుతో బ్రిడ్జ్ నిర్మాణం జరపడం లేదు. నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేవలం రూ.25 కోట్లు ఖర్చు పెడితే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్… ఇక్కడి ప్రజల సమస్యలు ఎందుకు తీర్చటం లేదు ? తక్షణమే ఈ రోడ్లో బ్రిడ్జ్ నిర్మించాలి. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల మూడు నెలల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పనులు పూర్తి చేయకపోతే వచ్చే సోమవారం నుంచి స్థానిక కాంగ్రెస్ పోరాట కార్యాచరణ మొదలు పెడుతుంది.” అని రేవంత్ వ్యాఖ్యనించారు.
ఇవి కూడా చదవండి :
- ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్… మంత్రి హరీశ్ రావు
- గ్రామంలో ప్రత్యేక్షమైన పులిపిల్లలు… జనాల సెల్ఫీలు
- చెరుకు సుధాకర్ను ఉద్దేశపూర్వకంగా ఫోన్లో తిట్టలేదు… కోమటిరెడ్డి వివరణ
- సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి కీలక సమావేశం
- నగరంలో పట్టుబడ్డ డ్రగ్స్… విక్రయిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు