
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : నంద్యాల జిల్లాలో పెద్ద పులి పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లలు కనిపించాయి. పెద్ద గుమ్మడాపురం సమీపంలో నల్లమల అటవీ ప్రాంత నుంచి తప్పించుకుని ఊరి చివర పంట పొలాల్లోకి వచ్చాయి. నాలుగు పెద్ద పులి పిల్లలను స్థానకులు గుర్తించారు. పులి పిల్లలపై కుక్కలు దాడి చేసి గాయపరచకుండా.. వాటిని తీసుకెళ్లి ఓ గదిలో భద్రపరిచారు. ఈ పిల్లలను చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల జనాలు కూడా వస్తున్నారు. కొందరు ఆ పిల్లలతో సెల్ఫీలు దిగారు.
Read Also : నగరంలో పట్టుబడ్డ డ్రగ్స్… విక్రయిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు
పులి పిల్లలు దొరికిన విషయాన్ని అటవీశాఖఅధికారులకు సమాచారం అందించారు. ఈ పిల్లలు గ్రామం వైపు ఎలా వచ్చాయని స్థానికులు అవాక్కయ్యారు. అటవీశాఖ అధికారులు పులి పిల్లల్ని స్వాధీనం చేసుకోనున్నారు. అయితే ఈ పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలా?.. లేక జూకు తరలించాలా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ పిల్లలను జూకి తరలిస్తే తల్లి పులి వీటి కోసం గ్రామంలోకి చొరబడి ప్రజలపై దాడి చేసే అవకాశముందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అలాగని అటవీ ప్రాంతంలో వదిలేసే కుక్కలు, ఇతర జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటిని ఎక్కడికి తరలించాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి :
- చెరుకు సుధాకర్ను ఉద్దేశపూర్వకంగా ఫోన్లో తిట్టలేదు… కోమటిరెడ్డి వివరణ
- సాత్విక్ ఆత్మహత్య నేపథ్యంలో ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి కీలక సమావేశం
- చరిత్ర తిరగరాస్తుందా..! ఉచిత హామీలు ఊపిరి పోస్తుందా..!
- తెలంగాణలో లేటెస్ట్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!