
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం బీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నరకాని వెళ్తాడని మండిపడ్డారు. నిజానికి కేఏ పాల్ ఇటీవల కాలంలో ఒకటి రెండు అంశాల్లో కేసీఆర్ను మెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత చుట్టూ మద్యం స్కాం కేసు చుట్టుముట్టిన తరుణంలో అన్ని పార్టీల నాయకులు ఏం జరుగుతుందా ? అని ఎదురు చూశారు.
Read More : హైదరాబాద్లో దారుణ హత్య కలకలం… ప్రేక్షక పాత్ర పోషించిన వాహనదారులు
ఇలాంటి సమయంలో బీజేపీయేతర ఏ పార్టీ కూడా స్పందించలేదు. కానీ పాల్ మాత్రం సంచలన వ్యాఖ్య లు చేశారు. కవితపై కేంద్రం కక్ష కట్టిందని.. తెలంగాణకు డబ్బులు ఇవ్వకుండా.. అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసిందని వ్యాఖ్యానించారు. దీంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అదేంటి.. నిత్యం విమర్శలు గుప్పించే పాల్.. ఇలా పాలు నీళ్లలా కలిసిపోయారు.. అని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే పాల్ తన మాటలకు పదును పెంచారు.
Read More : అరుదైన వ్యాధితో బాధపడుతున్న వంటలక్క
తెలంగాణ సీఎం కేసీఆర్ దొర కాదు దొంగ అని కోర్టులో రుజువు చేస్తానని అన్నారు. ఆయన తనను ఎదుర్కోలేక.. తన సోదరుడి హత్య కేసును తిరగతోడుతున్నారని కేసీఆర్ పై పాల్ నిప్పులు చెరిగారు. హైకోర్టు సుప్రీం కోర్టును కేసీఆర్ కొనలేరన్నారు. ప్రపంచంలోని మహామహా నేతలనే తన ముందు మోకరిల్లేలా చేశానని కేసీఆర్ ఎంత అంటూ హెచ్చరించారు.కేసీఆర్ తనను చంపేస్తే స్వర్గానికి వెళ్తానని కానీ.. చేసిన అవినీతి పాపాలకు కేసీఆర్ ఖచ్చితంగా నరకానికి వెళ్తారని.. ఇది తాను ఇస్తున్న శాపమని.. పాల్ వ్యాఖ్యానించారు. తాను ప్రార్థన చేస్తే కేసీఆర్ నాశనం అవుతారని.. ఇప్పటి వరకు అలా చేయలేదని చెప్పారు. దేవుడి దూత మీద చెయ్యి వేస్తే దేవుడు క్షమించడని చివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తమ్ముడు కూడా మిగలలేదని పాత సంగతులు చెప్పుకొచ్చారు. మరి పాల్తో పెట్టుకుంటే అంతే అంటున్నారు నెటిజన్లు.
ఇవి కూడా చదవండి …
-
అత్యంత విషమంగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న నిమ్స్ డాక్టర్లు
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విరుచుకపడిన రేవంత్ రెడ్డి… కొనసాగుతున్న పాదయాత్ర
-
ఏపీలో బిఆర్ఎస్ మైండ్ గేమ్… 175 స్థానాలలో పోటీ ప్రకటన అందుకేనా???
-
పచ్చని పల్లెలకు కొత్త కష్టం…. గుంపులు గుంపులుగా ఈగల దాడి
-
కాంగ్రెస్ పార్టీతో పొత్తు… రేవంత్ రెడ్డితో విభేదాలపై సిపిఐ పార్టీ నారాయణ కీలక వ్యాక్యలు