
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి గురువారం ప్రకటించారు. పార్టీలో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసున్నట్లు గురువారం మీడియాకు వెల్లడించారు. నేటి సాయంత్రంతో నామినేషన్ల గడువు ముగుస్తుండగా.. చివరి నిమిషంలో బీజేపీ పోటీపై వెనక్కి తగ్గింది. మొన్నటివరకు పోటీ చేసే విషయంపై టీ బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం విషయంలో మిత్రపక్షమైన ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
Read Also : హైదరాబాద్లో దారుణ హత్య కలకలం… ప్రేక్షక పాత్ర పోషించిన వాహనదారులు
హైదరాబాద్ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 118 ఓట్లు ఉండగా.. ఎంఐఎంకు 52 ఓట్లు ఉన్నాయి. ఇక అధికార బీఆర్ఎస్కు 41 ఓట్లు ఉండగా. బీజేపీకి 25 ఓట్ల బలం మాత్రమే ఉంది. 60 ఓట్లు వచ్చినవారు గెలిచే అవకాశం ఉంటుంది. ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటే బాగుంటుందని కొంతమంది బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు దీనిపై తుది నిర్ణయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికే పార్టీ అగ్రనేతలు వదిలేశారు. ఎక్కువ ఓట్లు లేకపోవడంతో పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు. అంతేకాకుండా పార్టీలో పోటీపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతుండటంతో.. పోటీకి దూరంగా ఉండాలని కాషాయదళం నిర్ణయించింది. తెలంగాణలో ఖాళీ అవుతున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read : వైఎస్సార్ మిగలలేదు.. కేసీఆర్ కు నరకమే! కేఏ పాల్ శాపనార్ధాలు
ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేయగా.. 23వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. శుక్రవారం నామినేషన్లను పరిశీలించనుండగా.. నామినేషన్ల ఉపసంహరణకు 27 వరకు గడువు విధించారు. వచ్చే నెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఫలితాలను వెల్లడించనున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బీఆర్ఎస్ మద్దతుతో మీర్జా రహమత్ బేగ్ పేరును ఇటీవల ఎంఐఎం ప్రకటించింది. ఇక మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘం నాయకుడు గాల్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దాదాపు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించే అవకాశముంది.
ఇవి కూడా చదవండి :
- అత్యంత విషమంగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న నిమ్స్ డాక్టర్లు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విరుచుకపడిన రేవంత్ రెడ్డి… కొనసాగుతున్న పాదయాత్ర
- పచ్చని పల్లెలకు కొత్త కష్టం…. గుంపులు గుంపులుగా ఈగల దాడి
- ఏపీలో బిఆర్ఎస్ మైండ్ గేమ్… 175 స్థానాలలో పోటీ ప్రకటన అందుకేనా???
- మురారీ సినిమా తరహాలో ఎన్టీఆర్ ఫ్యామిలీని శాపం వెంటాడుతోందా?
3 Comments