HyderabadTelangana

అంబర్‌పేట్ కుక్కల దాడి ఘటన… ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి చెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలుడు ప్రదీప్ మృతి ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. GHMC నిర్లక్ష్యం కారణంగానే బాలుడు చనిపోయాడని హైకోర్టు ధర్మాసనం మండిపడింది. వీధి కుక్కలు ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. GHMC ఏం చేస్తోందని ప్రశ్నించింది. అంబర్‌పేటలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ, అంబర్‌పేట్ మున్సిపల్ అధికారికి న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. బాలుడి మృతి ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

 Read Also : టీడీపీలో చేరిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. జగన్ పై విమర్శలు

వీధి కుక్కల దాడిలో పసివాడు మృతి చెందటం బాధాకరమని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. చిన్నారి మృతికి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. అనంతరం కేసు విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి కుటుంబంతో సహా ఇక్కడే ఉంటున్నారు. అంబర్‌పేటలోని ఓ కార్ సర్వీసింగ్ సెంటర్‌లో అతడు వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. ఫిబ్రవరి 19న తన ఇద్దరు పిల్లల (ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కొడుకు ప్రదీప్‌)ను తాను పనిచేస్తున్న చోటుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో చాలా సేపు పిల్లలిద్దరూ అక్కడే ఆడుకున్నారు. గంగాధర్ ఏదో పనిమీద కారు షోరూం లోపలికి వెళ్లగా.. ప్రదీప్ అక్క క్యాబిన్‌లో కూర్చుంది. ఒంటరిగా బయటే ఉన్న ప్రదీప్‌పై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.

Read Also : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి దూరంగా బి‌జే‌పి..చివరి నిమిషంలో నిర్ణయం

ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చిన్నారిపై విచక్షాణారహితంగా దాడి చేశాయి. కాసేపటికి బయటకు వచ్చిన తండ్రి గంగాధర్ రక్తపు మడుగులో ఉన్న ప్రదీప్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బాలుడిపై కుక్కల దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఘాటుగా స్పందించారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారిపై కుక్కలు దాడి చేశాయంటూ మండిపడుతున్నారు. ఈ కేసును నిన్న (బుధవారం) సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ప్రభుత్వంపై సీరియస్ అయిన న్యాయస్థానం.. చిన్నారి మృతి ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి : 

  1. హైదరాబాద్‌లో దారుణ హత్య కలకలం… ప్రేక్షక పాత్ర పోషించిన వాహనదారులు
  2. అత్యంత విషమంగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న నిమ్స్ డాక్టర్లు
  3. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విరుచుకపడిన రేవంత్ రెడ్డి… కొనసాగుతున్న పాదయాత్ర
  4. ఏపీలో బి‌ఆర్‌ఎస్ మైండ్ గేమ్… 175 స్థానాలలో పోటీ ప్రకటన అందుకేనా???
  5. పచ్చని పల్లెలకు కొత్త కష్టం…. గుంపులు గుంపులుగా ఈగల దాడి          

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.