
క్రైమ్ మిర్రర్, కరీంనగర్ : భూమ్మీద నూకలుండాలే గాని ఎలాంటి ప్రమాదం నుంచైనా బతికి బట్టకట్టవచ్చు. ఎంతటి ప్రమాదమైన ఏం చేయలేదు. అందుకు నిదర్శనంగా నిలిచే ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మానకొండూరు సంజీవ్నగర్ కాలనీకి చెందిన మధునమ్మ (80) అనే వృద్ధురాలికి మతిస్థిమిత్తం లేదు. ఇంటి పరిసరాల్లోనే అటు ఇటూ తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో నిన్న (మంగళవారం) ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన మధునమ్మ.. ఇంటి సమీపంలోని ఓ చేద బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది.
Also Read : సోమేష్ కుమార్ వీఆర్ఎస్కి అప్లై చేయడం వెనుక కారణం… బీహార్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పగ్గాలు..?
బావిలో పడిన వెంటనే మోటర్కు బిగించిన పైపును పట్టుకుని అందులోనే ఉండిపోయింది. అనంతరం బావిలోనుంచి మధునమ్మ గొంతుతో కేకలు వినిపించటంతో ఇంటి పక్కనే ఉండే ఓ మహిళ బావి వద్దకు వచ్చి చూసింది. వృద్ధురాలు పైపును పట్టుకొని వేలాడుతుండటంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు ఆమెను బయటకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో వెంటనే స్థానికంగా ఉండే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
Read Also : బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమిని ఆ దేవుడు కూడా కాపాడలేడు…ఈటల రాజేందర్
అక్కడికి చేరుకున్న ఫైర్మెన్ ధర్ము ఛైర్నాట్ (లోతులో పడిపోయిన వారిని క్షేమంగా బయటకు తేవడానికి తాడుతో కాళ్లను, నడుమును కలుపుతూ కట్టే విధానం) పద్ధతిని ఉపయోగించి వృద్ధురాలని క్షేమంగా బయటకు తీశాడు. 66 అడుగల లోతులో మధునమ్మ పడిపోయినా.. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆమెను సురక్షితంగా బయటకు తీసిన అగ్నిమాపక సిబ్బందికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ భూమ్మీద నూకలుండాలే గాని ఎలాంటి ప్రమాం నుంచైనా బయటపడొచ్చని స్థానిక ప్రజలు అంటున్నారు. మధునమ్మ గట్టి పిండమని.., ఇంకా నూకలున్నాయి కాబట్టే అంత లోతు బావిలో పడినా సురక్షితంగా బయటపడిందని చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్….
- ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించిన హైకోర్ట్…
- ఆస్తుల సృష్టిలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానం….
- ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతారు… ట్విట్టర్లో సెటైర్లు పేల్చిన మంత్రి కేటీఆర్
- హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు… మజ్లిస్కు బీఆర్ఎస్ మద్దతు