
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కంటోన్మెంట్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అసలు ఉప ఎన్నిక ఉంటుందా ? ఉండదా ? అనే చర్చ జోరుగా నడుస్తోంది. సాధారణంగా ఎంపీ లేదా ఎమ్మెల్యే రాజీనామా చేసినా, చనిపోయినా ప్రజాప్రాతినిధ్య చట్టం 151A ప్రకారం ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఈ చట్టం ప్రకారం ఆగస్టు 20లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో మరో 10 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ లేదా శాసనసభ గడువు ఏడాదిలోపు ముగిసేలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపుంతుంది. ఎన్నిక నిర్వహించడం కష్టమని ధ్రువీకరిస్తుంది.
Read Also : ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించిన హైకోర్ట్…
గంతలోనూ పలు ఉప ఎన్నికలను వాయిదా వేశారు. ఈ విధంగా చూస్తే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న రెండ్రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతూ ఆయన ఆదివారం కన్నుమూశారు. 1994 నుంచి 2004 వరకు వరుసగా మూడు సార్లు, 2014, 2018 ఎన్నికల్లో మెుత్తం 5 సార్లు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన మృతితో ఖాళీ అయిన ఈ స్థానంపై బీఆర్ఎస్ యువనేతలు ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారు పైరవీలు చేయించుకోని టికెట్ రేసులో నిలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2014 ఎన్నికల వరకు సాయన్న టీడీపీ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన 2016లో బీఆర్ఎస్లో చేరగా.. 2018లో కారు గుర్తుపైనే పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా గజ్జల నగేశ్ పోటీ చేసి ఓడిపోయారు.
Also Read : బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమిని ఆ దేవుడు కూడా కాపాడలేడు…ఈటల రాజేందర్
2018లో సాయన్నకు సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వటంతో.. గజ్జల నగేశ్కు ఛాన్స్ దక్కలేదు. సాయన్న రాకముందు నియోజవర్గ బాధ్యతలు నగేశ్ చూసునేవారు. దీంతో ఈసారి తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. ఇక కంటోన్మెంట్ నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు యువనేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారిద్దరూ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు సన్నిహితులు కావటంతో పోటీ మరింత పెరిగింది. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్గా కొనసాగుతున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ సీటుపై కన్నేశారు. ఈయన మంత్రి హరీశ్ రావుకు అత్యంత సన్నిహితుడు. దీంతో మంత్రి ద్వారా టికెట్ పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో అసెంబ్లీ టికెట్ కోసం పోటీపడినా.. అవకాశం దక్కలేదు. ఈ సారి మాత్రం టికెట్ సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విలూరుతున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్గా ఉన్న మన్నె క్రిషాంక్ కూడా ఈ సీటుపై కన్నేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే క్రిషాంక్.. మంత్రి కేటీఆర్కు సన్నిహితుడు.
Read Also : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్…
2019 వరకు క్రిశాంక్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014,18 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించినా.. భంగపాటు తప్పకపోవటంతో 2019లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన ఉవ్విలూరుతున్నారు. ఇదిలా ఉండగా.. కంటోన్మెంట్ టికెట్ తనకే వస్తుందని సాయన్న కూతురు లాస్య ధీమాగా ఉన్నారు. సాయన్నకు కుమారులు లేకపోవటంతో ఆయన కుమార్తె సాయన్న వారసురాలిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె కవాడిగూడ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. సాయన్న రాజకీయ వారసురాలిని తనే అని.., బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ తనకే కేటాయిస్తుందని ఆమె ధీమాగా ఉన్నారు. అయితే వీరిలో ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె క్రిశాంక్ మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- కేటీఆర్ ఆ కుటుంబానికి ఆదుకోవాలి… రేవంత్ రెడ్డి డిమాండ్
- ఆంద్రప్రదేశ్ టూ తెలంగాణ… గంజాయి రవాణా చేస్తున్న ఉప సర్పంచ్ ముఠా అరెస్ట్
- సోమేష్ కుమార్ వీఆర్ఎస్కి అప్లై చేయడం వెనుక కారణం… బీహార్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పగ్గాలు..?
- 66 అడుగుల బావిలో పడిన వృద్ధురాలు.. క్షేమంగా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
One Comment