
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఆస్తుల సృష్టిలో కేసీఆర్ సర్కార్ అసాధారణ వృద్ధిని సాధిస్తోంది. రాష్ట్ర సామాజిక-ఆర్థిక సర్వే 2023 రిపోర్టు ఆధారణంగా చూస్తే గోవా మొదటి స్థానంలో ఉంటే.. తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. ఇక.. ప్రధాన రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ మెుదటి స్థానంలో నిలవటం గమనార్హం. 2014లో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రభుత్వం వద్ద మొత్తం 60 లక్షల చదరపు అడుగుల భవనాలు ఉంటే… గడిచిన ఎనిమిదేళ్లలో 2 కోట్ల 30 లక్షల చదరపు అడుగులకు పెంచటం విశేషం. రాష్ట్రంలో సుమారు 8.50 లక్షల చదరపు అడుగులతో కొత్త సచివాలయంతో పాటు అన్ని జిల్లాల్లో.. సమీకృత కలెక్టరేట్ భవనాలు, విద్యాసంస్థలు, హాస్పిటల్స్ నిర్మిస్తుండటం.. ఆస్తులు భారీగా పెరగటానికి దోహదపడుతున్నాయి.
Read Also : బాలుడిపై వీధి కుక్కల దాడి… మృతి –
తెలంగాణలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెంచటం వల్ల.. ఆయా జిల్లాల్లో కొత్తగా గవర్నమెంట్ ఆఫీసులు, కలెక్టరేట్లు నిర్మించేందుకు నడుం బిగించింది సర్కారు. వీటితో పాటు ఇటు హైదరాబాద్లోనూ అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించటాన్ని సీఎం కేసీఆర్ నిర్ణయాలతో.. 40 లక్షల చదరపు అడుగులకు పైగా ఆస్తులు పెరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్ 2.0 నిర్మాణం, ఐటీ రంగాన్ని టైర్-2 నగరాలకు విస్తరించాలన్న ఆలోచనలో భాగంగా.. ఆయా నగరాల్లో నిర్మిస్తోన్న ఐటీ టవర్ల నిర్మాణం ఫలితంగా… 10,68,850 చదరపు అడుగుల ఆస్తులు ఏర్పడ్డాయి. వీటితో పాటు.. హైదరాబాద్లో 61,544 చదరపు అడుగుల్లో బంజారా భవన్, 82,009 చదరపు అడుగుల్లో ఆదివాసీ భవన్ను తెలంగాణ సర్కార్ నిర్మించింది.
Also Read : ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతారు… ట్విట్టర్లో సెటైర్లు పేల్చిన మంత్రి కేటీఆర్
ప్రతి జిల్లా కేంద్రంలో.. ఒక మెడికల్ కాలేజీని దానికి అనుబంధంగా ఒక నర్సింగ్ కాలేజీని నెలకొల్పడం వల్ల మరో 32 లక్షల చదరపు అడుగుల ఆస్తి ఏర్పటైనట్టైంది. 2019లో హైదరాబాద్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్యీ క్వార్టర్లను పూర్తి చేయటం వల్ల 2.88 లక్షల చదరపు అడుగుల ఆస్తుల సృష్టి జరిగింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో అదనంగా 4.23 లక్షల చదరపు అడుగుల ఆస్తిని సృష్టించింది. కేవలం భవనాల నిర్మాణంతోనే ఆస్తుల సృష్టి చేయకుండా.. కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టులు కూడా నిర్మించింది. రూ.35,000 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథను నిర్మించగా.. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు… మజ్లిస్కు బీఆర్ఎస్ మద్దతు
- భార్య బాగోతం.. చెడు వ్యసనాలకు బానిసగా మారి, కట్టుకున్న భర్తనే
- కొండగట్టుకు కేంద్రం నుండి నిధులు తెస్తావా…. బండి సంజయ్ కు మంత్రి కొప్పుల సవాల్
- రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది… జగ్గారెడ్డి
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై దాడి… కుర్చీలు, కర్రలు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు
2 Comments