Telangana

ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించిన హైకోర్ట్…

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో సంచలనంగా మారిన ఖదీర్ ఖాన్ మృతిపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అతడి మృతిపై కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్ శాంతి కుమారి, డీపీజీ అంజనీ కుమార్‌లతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, మెదక్ ఎఎస్పీ, ఎస్‌హెచ్‌వోను ధర్మాసనం ఆదేశించింది. దొంగతనం కేసులో అనుమానితుడిగా ఖదీర్ ఖాన్‌ను అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేయటంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నా వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకొని ఇవాళ విచారణ చేపట్టింది.

Read Also : ఆస్తుల సృష్టిలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానం….

గత 24న మెదక్ పట్టణంలోని అరబ్ గల్లీలో దొంగతనం జరిగింది. ఓ మహిళ మెడలో నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఆ సమయంలో అనుమానస్పందంగా వెళ్తున్న ఓ వ్యక్తిని సీసీ కెమెరాల్లో గుర్తించారు. అతడు పిట్లంబేస్‌కు చెందిన మహ్మద్ ఖదీర్ ఖాన్(35)ను పోలి ఉండటంతో ఇతనే నేరం చేశాడని తన చిన్నమ్మ ఇంటి వద్ద ఉన్న ఖదీర్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జనవరి 29న మెదక్ పోలీసు స్టేషన్ తీసుకొచ్చి విచారించారు. విచారణ పేరిట ఖదీర్ ఖాన్‌ను నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. తాను నేరం చేయలేదని.. ఆ సమయంలో అసలు ఊర్లోనే లేనని.. హైదరాబాద్‌లో తన చిన్నమ్మ ఇంటికి వెళ్లానని ఎంత ప్రాధేయపడినా వినిపించుకోకుండా పోలీసులు అతడిపై కర్కషత్వాన్ని ప్రదర్శించారు.

Also Read : బాలుడిపై వీధి కుక్కల దాడి… మృతి

నాలుగు రోజుల పాటు అతడిని శారీరకంగా హింసించి చివరకు అతడు నేరం చేయలేదని తెలిసి.. ఫిబ్రవరి 2న విడిచిపెట్టారు. ఖదీర్ ఖాన్‌ను భార్య ఇంటికి తీసుకెళ్లగా.. వారంరోజుల్లోనే అతడు తీవ్ర అసవస్థతకు గురయ్యాడు. వెంటనే మెదక్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా అతడి పరిస్థితి మెరుగుపడకపోటవంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గాంధీలో చికిత్స పొందుతూ ఖదీర్ ఖాన్ ఈనెల 16న కన్నుమూశాడు. ఖదీర్ ఖాన్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు అతడిని పరామర్శించేందుకు వెళ్లగా.. తనను పోలీసులు అకారణంగా కొట్టారని వాపోయాడు.

Read Also : ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతారు… ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చిన మంత్రి కేటీఆర్

చేయని నేరాకని తనను వేలాడదీసి తీవ్రంగా కొట్టారని కన్నీరు పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఖదీర్ ఖాన్ ఉదంతంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైఖరిపై మండిపడ్డారు. ఓ అమాయకుడి ప్రాణాలు బలి తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై సిట్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన పోలీసులు ఉన్నతాధికారులు స్థానిక సీఐతో పాటు ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక ఖదీర్ ఖాన్ ఘటనపై మీడియాలో వరుస కథనాలు రావటం, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడటంతో హైకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించింది. అతడి మృతిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి : 

  1. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు… మజ్లిస్‌కు బీఆర్ఎస్ మద్దతు
  2. భార్య బాగోతం.. చెడు వ్యసనాలకు బానిసగా మారి, కట్టుకున్న భర్తనే
  3. కొండగట్టుకు కేంద్రం నుండి నిధులు తెస్తావా…. బండి సంజయ్ కు మంత్రి కొప్పుల సవాల్
  4. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది… జగ్గారెడ్డి
  5. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ…. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.