Telangana

కేసీఅర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి : పాదయాత్రలో వైఎస్ షర్మిల

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో చేపడుతున్న పాదయాత్ర నేడు 3800 కి.మీ దాటింది. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద వంగర మండలం అవుతాపూర్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. అవుతాపూర్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహా ఏర్పాటును బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ గ్రామ మహిళలు ఎదురు తిరిగి దగ్గరుండి వైఎస్సార్ విగ్రహాన్ని కట్టించారు. చలిమంటలు వేసుకొని మరీ విగ్రహాన్ని కట్టించారు. రాత్రి అంతా కాపలా కాశారు. వైఎస్సార్ బిడ్డ ఇందుకు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతుంది.

Read Also : ఆర్‌ఎస్‌ఎస్‌తో టచ్‌లో సీఎం కేసీఆర్… సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

కానీ కేసీఆర్ పేపర్ నమస్తే తెలంగాణ మాత్రం మహిళలు అడ్డుకున్నారు అని రాసింది. ఇది ఎంత వరకు వాస్తవం..? ఇక్కడ మహిళలతో మాట్లాడకుండా వార్త ఎలా రాశారు..?’ అని షర్మిల ప్రశ్నించారు. ‘మహిళలు చలిమంట వేసుకొని కూర్చుని విగ్రహం కట్టిస్తే.. మహిళలు అడ్డగించారు అని రాశారు. గ్రామస్తులు అంగీకారం తెలిపి వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టుకున్నారు. విగ్రహం పెట్టినందుకు గ్రామస్తుల మీద కేసు పెట్టారట. నమస్తే తెలంగాణ వార్తను ఖండిస్తున్నాం. కేసీఆర్ భజన చేయడానికి ఉన్న పేపర్ నమస్తే తెలంగాణ. నిజాన్ని అబద్ధాలుగా ప్రచారం చేసే పేపర్ నమస్తే తెలంగాణ. తెలంగాణలో అడుగడుగునా సమస్యలు ఉన్నాయి. పాదయాత్రలో ప్రతి అడుగు సమస్యల వలయమే. కేసీఅర్ పాలన అద్బుతం అని ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘కేసీఆర్ పథకాలు అందరికీ అందుతున్నాయని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.

Also Read : చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి

మహిళలను ఆర్థిక అభివృద్ధి చేశారట..రైతులను కోటీశ్వరులు చేశారట. రూ.40 వేలు ఇచ్చే రైతు సబ్సిడీ పథకాలను బంద్ పెట్టి రూ.5 వేలు రైతుబంధు ఇస్తే కోటీశ్వరులు అవుతారా..? రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికీ ఇచ్చింది 43 వేల ఉద్యోగాలు మాత్రమే. ఈ ఉద్యోగాలు ఎప్పటికీ వస్తయో తెలియదు. ఉద్యోగాలు లేక బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివి రోడ్లపై తిరుగుతున్నారు’ అని షర్మిల పేర్కొన్నారు. ‘బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి అయ్యింది. ఇక్కడ ఉన్న మీ మంత్రికి అయ్యింది. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి.. కేసీఆర్ వస్తాడు. కేసీఆర్‌కి మళ్ళీ ఓట్లు వేస్తే తెలంగాణ గుల్ల అవుతుంది. కేసీఆర్‌కు కేవలం ఓట్లతోనే పని. కేసీఅర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి’ అని షర్మిల తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

  1. మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం… చెరువులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య
  2. బీఆర్ఎస్‌తో పొత్తుపై వెంకటరెడ్డి యూటర్న్… పొత్తు ఉండదంటూ మళ్లీ వ్యాఖ్యలు
  3. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ…. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
  4. చంద్రబాబు పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన ప్రమాదం
  5. పేద ప్రజలకు ముక్క బియ్యం…. డీలర్ వేడుకోలు, తిరిగి తీసుకెళ్లని అధికారులు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.