
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మెదక్ జిల్లాలో ఓ ప్రేమ జంట అదృశ్యం చివరకు విషాదాంతంగా మారింది. నార్సింగిలో అదృశ్యమైన ప్రేమ జంట సమీపంలోని చెరువులో విగత జీవులుగా మారారు. నాలుగు రోజుల క్రితం కల్పన, ఖలీల్ అనే ప్రేమికులు అదృశ్యమవ్వగా.. నార్సింగి చెరువులో గురువారం శవాలుగా తేలారు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఖలీల్ అనే డ్రైవర్తో కల్పన ప్రేమలో పడింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటుండగా.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారిద్దరి మతాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు.
Read Also : బీఆర్ఎస్తో పొత్తుపై వెంకటరెడ్డి యూటర్న్… పొత్తు ఉండదంటూ మళ్లీ వ్యాఖ్యలు
ఈ క్రమంలో కల్పనకు రెండు నెలల క్రితం వేరొక వ్యక్తితో కుటుంబసభ్యులు వివాహం జరిపించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో కల్పనకు ఖలీల్పై ప్రేమ తగ్గలేదు. శివరాత్రి పండుగ కోసం ఈ నెల 9న నార్సింగిలోని అత్తాగారింటికి కల్పన వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఇంటి నుంచి అదృశ్యమైంది. తన కూతురు కనిపించడం లేదంటూ కల్పన తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం నార్సింగిలో బస్సు ఎక్కి రామాయంపేటలో యువతి దిగినట్లు పోలీసులు సీసీ కెమెరాలలో గుర్తించారు. రామాయంపేట నుంచి బైక్పై మరో వ్యక్తితో కల్పన వెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయింది. దీని ఆధారంగా పోలీసులు గాలిస్తుండగా.. నార్సింగి చెరువు ఒడ్డున మంగళవారం బైక్, చెప్పులు కనిపించాయి.
Also Read : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ…. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
ఇవి ప్రేమజంటకి సంబంధించినవే అని భావించిన పోలీసులు.. చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానించారు. మంగళవారం నుంచి బుధవారం వరకు గజ ఈతగాళ్లు, వలల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. ఎవరి ఆచూకీ లభించలేదు. లాభం లేదనుకుని పోలీసులు ఇక చెరువులో గాలింపు చర్యలు ఆపేశారు. అయితే గురువారం ఉదయం ఇద్దరి శవాలు ఒక్కసారిగా చెరువులో తేలాయి. యువతి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, తమ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య ఘటనపై మరో కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. కుటుంబసభ్యులు, బంధువులను ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- నీరా తాగిన వైఎస్ షర్మిల… కల్లు గీత కార్మికుల సమస్యలపై ఆరా
- చంద్రబాబు పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన ప్రమాదం
- గిరిజన ద్రోహి సీఎం కేసీఆర్…. ముఖ్యమంత్రిపై బండి సంజయ్ ఫైర్
- కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన… ఆలయ అభివృద్ధికి మరో రూ. 500 కోట్లు
- పేద ప్రజలకు ముక్క బియ్యం…. డీలర్ వేడుకోలు, తిరిగి తీసుకెళ్లని అధికారులు
One Comment