
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహారం ప్రస్తుతం టీ పాలిటిక్స్లో గుబులు రేపుతోంది. గత కొంతకాలంగా బీజేపీలో కాస్త అసంతృప్తితో ఉన్న ఆయనను తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారనే వార్తలు హల్చల్ చేస్తోన్నాయి. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగంలో పదే పదే ఈటలను కేసీఆర్ ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్లో నెంబర్ 2గా చెప్పుకునే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా అసెంబ్లీలో ఈటలపై పరోక్షంగా ప్రశంసల కురిపించారు. ఈటలను బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రజలందరూ చూసేలా పొగడ్తలు కురిపించడం వెనుక కారణం ఏంటనేది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also : పుల్వామా దాడికి నాలుగేళ్లు… 40 మంది అమర జవాన్లకు దేశం ఘన నివాళి
ఈటలను తిరిగి తమ పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఈటల గులాబీ కండువా కప్పుకోబోతున్నారంటూ జాతీయ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ వార్తలపై మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. ‘ఈటల రాజేందర్ను బీఆర్ఎస్లో చేరేలా చేసేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం ఎంతో నిరాశలో ఉంది’ అని కొండా విశ్వశ్వర్ రావు ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ నేతనే ఈటలను బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈటలకు గత కొంతకాలంగా బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదు. అంతేకాకుండా మాజీ ఎంపీ వివేక్తో పాటు పలువురు సీనియర్ నేతలతో ఆయనకు విబేధాలు ఉన్నాయనే వార్తలు భగ్గుమన్నాయి. బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఇటీవల ఈటల చేసిన వ్యాఖ్యలు కాషాయ పార్టీలో కలకలం రేపాయి.
Also Read : తెలంగాణ రాష్ట్ర అప్పుల వివరాలు వెల్లడి…. మెుత్తం అప్పులు 4,33,817.6 కోట్లు
ఈటల వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే తప్పుబడటంతో కాషాయ పార్టీలో ఈటల హవా నడవడం లేదనే వాదనలు వినిపించాయి. చేరికల కమిటీ చైర్మన్ మినహా బీజేపీలో ఈటలకు ఎలాంటి కీలక పదవి ఇవ్వలేదు. గతంలో పలుమార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈటల ఏకాంతంగా భేటీ అయ్యారు. దీంతో బండి సంజయ్ను తొలగించి ఈటలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారనే ప్రచారం నడిచింది. కానీ ఇప్పటివరకు ఈటలకు కీలక పదవి అప్పగించే విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈటల బీజేపీలో కాస్త అసంతృప్తిగా ఉన్నారని, గతంలో చేసినట్లు కేసీఆర్ సర్కార్పై విమర్శలు చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్లో చేరతారని ఊహాగానాలు వినిపించడం వెనుక వ్యూహం ఏంటనేది చర్చకు దారి తీసింది.
ఇవి కూడా చదవండి :
- సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్… కేంద్ర ఆర్ధిక పరిస్థితిపై చర్చకు రావాలంటు సవాల్
- తెలంగాణలో కె -ల్యాబ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కైరోస్…
- తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారు… కేఏ పాల్
- బీఆర్ఎస్లోకి మరో బలిజ నాయకురాలు!