Telangana

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యాఖ్యలు… సొంత పార్టీలోనే దుమారం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో పొత్తులపై కాంగ్రెంస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సొంత పార్టీలోనే దుమారం రేపుతున్నాయి. ఇన్నాళ్లు గందరగోళంతో ఉన్న పార్టీ ఈ మధ్యే కొంత ప్రశాంతంగా మారి.. జనాల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి సొంత పార్టీలోనే అగ్గి రాజేస్తున్నాయి. కాంగ్రెస్‌తో సీఎం కేసీఆర్ కలవక తప్పదని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణంలో వచ్చేది హంగ్ మాత్రమేనని బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీలన్న కోమటి రెడ్డి.. ఎవరికీ 60 సీట్లు రావంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణ ప్రజల సంగతి అటుంచితే.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఎవైనా స్టేట్‌మెంట్లు ఇచ్చేటప్పుడు ముందూవెనుక చూసుకోవాల్సిన పని లేదా అంటూ అంతెత్తున లేస్తున్నారు.

Read Also : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ… కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్

ముందు నుంచి ఇలాంటి సంచలన వ్యాఖ్యలతో.. కోవర్టు అనే పదాన్ని వాడుకలోకి వచ్చేలా చేసిన కోమటిరెడ్డి.. ఇప్పుడు పొత్తు వ్యాఖ్యలతో మరోసారి సొంత పార్టీలోనే కుంపటి పెట్టేశారు. ఇక.. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఎన్నికల ముందు కానీ.. ఆ తర్వాత గానీ.. కేసీఆర్‌‌తో ఎలాంటి పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు పొత్తు పెట్టుకునే అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రధాన పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ రాబోదన్న మల్లు రవి.. మూడింట రెండు వంతుల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలను గందరగోళంలో పడేసేలా నేతలు మాట్లాడటం మంచిదికాదని.. డైరెక్టుగానే హెచ్చరించారు మల్లు రవి. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడా స్పందించారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న సందర్భంలో కోమటిరెడ్డి ఇలా మాట్లాడటం సరికాదని వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు. నేతలు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తే.. కార్యకర్తలు ధైర్యం కోల్పోతారని తెలిపారు. కీలక సమయంలో పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేయొద్దని హితవు పలికారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేసేందుకే ప్రయత్నిస్తున్నారన్న వీహెచ్.. తప్పులుంటే సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. అంతే కానీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీని తీవ్ర నష్టం వాటిల్లుతుందని వీహెచ్ వివరించారు.

Also Read : నూతన సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్…. అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభం

మరోవైపు.. గతంలో కోమటిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణలు చెప్పిన అద్దంకి దయాకర్ సైతం.. పొత్తు వ్యాఖ్యలపై స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు దయాకర్. పార్టీలో సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి.. ప్రతిసారి ఇలా మాట్లాడటం మంచిదికాదని హితవు పలికారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఇలాంటివి మాట్లాడే ముందు కోమటిరెడ్డి ముందూ వెనక ఆలోచించాలని సూచన చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొత్తులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీసేవిదంగా ఉన్నాయన్నారు. కార్యకర్తలు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో ఎంతో శ్రమించి పని చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న తరుణంలో ఇలాంటి మాటలు కార్యకర్తలను గందరగోళంలో పడేస్తాయన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా మాట్లాడడం సబబు కాదన్నారు.

Read Also : మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ….

పొత్తులు ఉండవని వరంగల్ సభలోనే రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని.. కాబట్టి కార్యకర్తలు ఎలాంటి సందేహాలు లేకుండా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ పార్టీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్‌తో పొత్తు విషయం ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగతం తప్ప పార్టీకి సంబంధం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది.. ఓటమి అంచున ఉందన్నారు. బీఆర్ఎస్‌ను ఓడించేది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. ఓటమి అంచున ఉన్న బీఆర్ఎస్‌కు పొత్తుల అవసరం ఉండొచ్చు కానీ.. కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం లేదన్నారు. గతంలోనే తెలంగాణ సభలో కాంగ్రెస్ పార్టీకి ఎవరితో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేయడమే కాకుండా పొత్తు గురించి మాట్లాడితే చర్యలు తీసుకుంటామన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. కేసీఆర్ కు వాళ్లంతా హ్యాండిచ్చారా?…సెక్రటేరియట్ ఓపెనింగ్ వాయిదా అందుకేనా ?
  2. కేసీఆర్‌తో కాంగ్రెస్ కలవాల్సిందే.. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి ఝలక్
  3. ప్రేమికులు జర భద్రం… వాలెంటైన్స్ డే బహిష్కరణకు పిలుపునిచ్చిన పలు సంస్థలు
  4. ఒకే నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల పాదయాత్రలు… మంత్రి ఇలాకాలో టెన్షన్
  5. ఈటల కోసం కేసీఆర్ విశ్వప్రయత్నం… ట్విట్టర్ వేదికగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.