National

స్విమ్మింగ్‌లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు… ఏడు పతకాలు సాధించిన వేదాంత్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తమిళ నటుడు ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్‌లో పతకాల పంట పండించాడు. ఖేలో ఇండియా గేమ్స్ 2023లో ఐదు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా ద్వారా గర్వంగా ప్రకటించారు. జాతీయ స్థాయి స్విమ్మర్ అయిన తన కుమారుడితో కలిసి దిగిన ఫొటోలను ఆయన షేర్ చేశారు. వంద మీటర్లు, 200 మీటర్లు, 1500 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు సాధించిన వేదాంత్.. 400 మీటర్లు, 800 మీటర్ల విభాగంలో రజత పతకాలు సాధించాడని మాధవన్ తెలిపారు.

Read Also : తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బి‌జే‌పి ప్లాన్

ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో 161 పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన మహారాష్ట్రకు మాధవన్ అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర 56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్య పతకాలు సాధించింది. బాయ్స్ టీం స్విమ్మింగ్‌లోనూ మహారాష్ట్ర విజేతగా నిలిచింది. ఇంతకు ముందు డీడీ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన వేదాంత్ సినిమాల్లో ఎందుకు వెళ్లలేదో తెలిపాడు. తన తండ్రి నీడలో బతకాలని తాను కోరుకోలేదన్నాడు. తనంత తానుగా పేరు తెచ్చుకోవాలని భావించానన్నాడు. ‘నేను కేవలం మాధవన్ కుమారుడిగా ఉండిపోవాలని అనుకోలేదు’ అని తెలిపాడు. తన తల్లిదండ్రులు తన కోసం ఎంతో త్యాగం చేశారన్న వేదాంత్.. తన కోసం దుబాయ్ షిఫ్ట్ అయ్యారన్నాడు.

Also Read : బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారు… కేఏ పాల్

వేదాంత్‌ ఒలింపిక్స్‌కు ప్రిపేర్ కావడం కోసం కొన్నేళ్ల క్రితం మాధవన్ కుటుంబం దుబాయ్‌కి మకాం మార్చింది. తన కొడుకు విజయాలను సెలబ్రేట్ చేసుకోవడాన్ని మాధవన్ ఎప్పుడూ మిస్ అవ్వరు. డానిష్ ఓపెన్‌లో వేదాంత్ గోల్డ్ మెడల్ గెలిచాక.. ‘మీ అందరి ఆశీస్సులతో వేదాంత్ మాధవన్ 800 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచాడు’ అని మాధవన్ ట్వీట్ చేశారు. కోచ్ ప్రదీప్‌తోపాటు టీమ్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు. ఖేలో ఇండియాలో వేదాంత్ ఏడు పతకాలు గెలవడంతో మాధవన్ స్నేహితులు, సినీ పరిశ్రమ సహచరులు అతడికి అభినందనలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. దక్షిణ టర్కీ నగరంలో 4.7 తీవ్రతతో మరోసారి భూకంపం… 34 వేలు దాటిన మృతులు
  2. గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందుల కలకలం… మందులు తీసుకున్న పేషంట్లలో కలవరం
  3. 14 ఏళ్లు దుబాయ్ జైలులో శిక్ష.. చివరకు మరణం నుంచి తప్పించుకుని
  4. మరో శ్రీలంకలా మారిన పాకిస్తాన్.. ప్రజలపై కొత్త పన్నులు వేయడానికి రెడీ
  5. ఇక నుంచి ఫిబ్రవరి 14న “కౌ హగ్ డే”

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.