
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశ ఆర్ధిక పరిస్థితిపై మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. కేంద్రంపై మాత్రం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్కు అర్థమైందన్నారు. కేసీఆర్కు ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రగతిపై సభలో ఎందుకు చర్చించలేదన్నారు.
Read Also : గుంటూరు జిల్లాలో దారుణం…. గంజాయి మత్తులో యువతిని నరికి చంపిన దుండగుడు
‘దేశ ఆర్ధిక పరిస్థితిపై కేసీఆర్కు సవాల్ చేస్తున్నా. కేసీఆర్తో చర్చకు నేను సిద్దం. కేసీఆర్ ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తా. ప్రెస్క్లబ్కు రమ్మంటావా?.. ప్రగతిభవన్ లేదా మీ ఫాంహౌస్కు రమ్మంటావా? రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని వస్తారా? రండి.. దేశ ఆర్ధిక పరిస్థితిపై అవగాహన లేకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ధరణి, డబుల్ బెడ్ రూం ఇళ్లపై అసెంబ్లీలో ఎందుకు చర్చ జరగలేదు. కేసీఆర్కు సభలో మంత్రులు భజన చేయడమే పనిగా పెట్టుకున్నారు. నోరు తెరిస్తే మంత్రులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘బీజేపీ, కేంద్రంపై ద్వేషంతో విషప్రచారం చేస్తున్నారు. రాజీనామాకు తొందరెండుకు కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్భవన్లో రాజీనామా లేఖ ఇవ్వక తప్పదు. దేశ ఆర్ధిక పరిస్థితిపై ప్రెస్క్లబ్, గన్పార్క్, ప్రగతిభవన్లో ఎక్కడ చర్చకు వస్తారు? రాష్ట్రంలో కుటుంబ పాలనపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు. శాసనమండలిలో కాంగ్రెస్ లేకుండా చేసింది కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు కోసం అర్రులు చాస్తున్నారు.
Also Read : తెలంగాణలో కె -ల్యాబ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కైరోస్…
అందుకే కేసీఆర్ కాంగ్రెస్ను పొగడ్తలతో ముంచెత్తారు. 2014లో తెలంగాణ అప్పు రూ.60 వేల కోట్లు ఉంటే రూ.5 లక్షల కోట్లకు పెరిగింది.’ అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘నన్ను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్కు లేదు. తెలంగాణ అభివృద్దికి సహకరించాలని ఎన్నో లేఖలు రాశా. ఇంతవరకు ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని ప్రపంచానికి కేసీఆర్ తప్పుడు సంకేతం ఇస్తున్నారు. కేసీఆర్ మాట్లాడే భాష సరిగ్గా లేదు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు కేసీఆర్ దోచుకున్నారు. కేంద్రాన్ని విమర్శించడం కల్వకుంట కుటుంబానికి పరిపాటిగా మారింది’ అని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఇవి కూడా చదవండి :
- స్విమ్మింగ్లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు… ఏడు పతకాలు సాధించిన వేదాంత్
- తెలంగాణలో యూపి ఫార్ములా…. అధికారం కోసం బిజేపి ప్లాన్
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారు… కేఏ పాల్
- దక్షిణ టర్కీ నగరంలో 4.7 తీవ్రతతో మరోసారి భూకంపం… 34 వేలు దాటిన మృతులు
- గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందుల కలకలం… మందులు తీసుకున్న పేషంట్లలో కలవరం
One Comment