Telangana

గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందుల కలకలం… మందులు తీసుకున్న పేషంట్లలో కలవరం

క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. మరోసారి హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణ లోపం బయటపడింది. కాలం చెల్లిన మందులను పేషెంట్లకు ఇచ్చి.. వారి ప్రాణాలను అపాయంలో పడేశారు. దీంతో మందులు తీసుకున్న పేషెంట్లు బెంబేలెత్తిపోతున్నారు. గాంధీ హాస్పిటల్‌లో వైద్యులు 10వ తేదీన డయాబెటిక్ పేషంట్ల కోసం ప్రత్యేకంగా ఓపీలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం మూడో అంతస్తులోని ఎండోక్రినలాజీ విభాగంలో పేషెంట్లకు షుగర్ కంట్రోల్ కోసం ఇన్సూలిన్ పెన్‌లను అందించారు. అయితే ఇంటికి వెళ్లాక వాటిని వాడాలని సూచించారు.

Read Also : 14 ఏళ్లు దుబాయ్ జైలులో శిక్ష.. చివరకు మరణం నుంచి తప్పించుకుని

అయితే.. గాంధీ ఆస్పత్రిలో నిర్వహించిన ఈ శిబిరానికి వనస్థలిపురానికి చెందిన శివకుమారి అనే మహిళ వచ్చింది. ఈమె ఇంజెక్షన్ చేసుకున్న తరుణంలో ఇన్సులిన్ గడువు ముగిసినట్లుగా గుర్తించటంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఇన్సూలిన్ మందులపై.. 2021కే గడువు ముగిసినట్టు ఉండటాన్ని గమనించిన శివకుమారి వెంటనే ఈ విషయంపై వైద్య అధికారులను సంప్రదించారు. దీంతో.. వైద్యులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై ఆరా తీయగా.. ఫార్మసీ నుంచి ఎటువంటి షుగర్ ఇన్సులిన్‌లు అందించలేదని తేలింది. అయితే.. ఇప్పటికే పలువురికి ఈ గడువు ముగిసిన శాంపిల్స్ అందించినట్లుగా తెలుస్తుంది. ఎంతమందికి ఇచ్చారనేది ఇప్పటివరకు తెలియదు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Also Read : ప్రారంభమైన ఫార్ములా ఈ – రేస్…. తరలివచ్చిన సెలబ్రిటీలు, క్రికెటర్లు

ఈ మధ్యకాలంలో మెడికల్ రిప్‌ల ద్వారా ఫ్రీ శాంపిల్స్‌ను సేకరించి పలువురికి అందజేస్తుండగా.. కొంత మంది డ్రగ్ మాఫియాగా ఏర్పడి గడువు ముగిసిన మెడిసిన్‌ను కూడా వైద్యుల ద్వారా పంపిణీ చేసి ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే వాటిని తిరిగి తేదీలు మార్చి విక్రయిస్తున్నట్లుగా సమాచారం. అయితే మరి ఈ విషయం వైద్యులకు తెలిసే గడువు ముగిసిన మందులను పంపిణీ చేశారా.. లేక తెలియక పొరపాటు జరిగిందా.. అన్నది విచారణలో తేలనుంది. ఇక ఇదే విషయంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. కాలం చెల్లిన మందుల విషయంపై విచారణ జరిపించాలని సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. గాంధీ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల ప్రాణాలు అపాయంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుల్లెట్ బైక్ నడుపుతూ అసెంబ్లీకి రాజాసింగ్…
  2. పచ్చని తెలంగాణాను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టొదు…మంత్రి కే‌టి‌ఆర్
  3. రూ.1000 కోట్లు పంచినా రాజాసింగ్‌కు ఓటేయరు.. గోషామహల్‌లో ఫ్లెక్సీల కలకలం
  4. నేటి నుంచి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ – రేస్‌…. 20వేల మంది ప్రేక్షకులు వీక్షించేలా ఏర్పాట్లు
  5. ఈ నెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… బైబై మోదీ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.