
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అమిత్ షా పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమిత్ షా వస్తన్నప్పటికీ… రాష్ట్రంలో కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ అమిత్ షా టూర్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటనలో రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను గద్దె దించేందుకు అనుసరించాల్సిన వ్యూహలు, బీజేపీ బలోపేతంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి….
కేసీఆర్ను ఎదుర్కొవడంపై యాక్షన్ ప్లాన్ నేతలకు వెల్లడించనున్న అమిత్ షా.. రాష్ట్రంలోని బీజేపీ పరిస్థితి, రాజకీయ సమీకరణాలపై ఆరా తీయనున్నారు. కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను షురూ చేయడం, బడ్జెట్ సమావేశాలను మార్చిలో కాకుండా ఫిబ్రవరిలోనే నిర్వహిస్తుండటంతో.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు హల్చల్ చేస్తోన్నాయి. తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు ఖాయమని బీజేపీ నేతలు కూడా జోస్యం చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో అమిత్ షా పర్యటన కీలకంగా మారింది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా బీజేపీ శ్రమిస్తోంది. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా ఎలాంటి సూచనలు చేస్తారనేది పొలిటికల్ కారిడార్లో హాట్టాపిక్గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు పెట్టాలని బీజేపీ నిర్ణయించింది.
Also Read : ఎన్నెండ్లు ఈ నిరీక్షణ… నిరుద్యోగ భృతి పై ఊసేలేదు..ఇచ్చేది డౌటేనా…??
అమిత్ షా మీటింగ్తో తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ వస్తుందని కాషాయ నేతలు చెబుతున్నారు. శనివారం ఉదయం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ ఔట్ పరేడ్లో పాల్గొననున్నారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు అకాడమీ అధికారులతో భేటీ కానున్నారు. అనంతరం హోటల్లో బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.25 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి అమిత్ షా వెళ్లనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఇతర కీలక నేతలలు అమిత్ షా పర్యటనలో పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఎమ్మెల్యే రాజసింగ్కు తప్పిన ప్రమాదం… రోడ్డు మధ్యలో ఊడిపోయిన కారు టైర్
- అసెంబ్లీలో ధరణి పోర్టల్ పై వాడీ వెడీ చర్చ… కాంగ్రెస్ ఎంఎల్ఏల వాకౌట్….
- మోగిన ఎంఎల్సి ఎన్నికల నగారా… రెండు తెలుగు రాష్ట్రాలలో 15 స్థానాలకు ఎన్నిక
- బడిలో పాము కాటుకు గురై ఆరేళ్ల చిన్నారి మృతి….
- ఇక నుంచి ఫిబ్రవరి 14న “కౌ హగ్ డే”
One Comment