
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. బీజేపీ నేతల విమర్శలకు అధికార పార్టీ ధీటుగా సమాధానాలు చెప్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఒకరి కోసమో.. లేదా దోస్తుల కోసమో పనిచేసే రాష్ట్రం తెలంగాణ కాదంటూ.. ఈటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పరిశ్రమలకు తెలంగాణ అనుకూల రాష్ట్రమే తప్ప.. ఎవరో ఒక్కరికి అనుకూలం కాదంటూ తనదైన స్టైల్లో విమర్శలు చేశారు. సింగరేణి, గనుల కేటాయింపుపై ఈటల రాజేందర్ లేవనెత్తిన ప్రశ్నలకు కేటీఆర్ ఆన్సర్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని డిస్కంలకు గతంలో కేంద్రం లేఖలు రాసిందని కేటీఆర్ గుర్తు చేశారు.
Read Also : మేం అధికారంలోకి వస్తే సచివాలయం డోమ్ కూల్చేస్తాం… బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తక్కువ ఖర్చుతో వస్తున్న దేశీయ బొగ్గును కొనుగోలు చేయకుండా.. విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఆదేశించిందన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఆదేశాన్ని జారీ చేసిందో బీజేపీ నేతలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా, ఇండోనేషియా వెళ్లి వచ్చిన రెండు నెలల్లోనే ఆయన మిత్రులకు అక్కడి బొగ్గుగని లీజు దొరుకుందని కేటీఆర్ ఆరోపించారు. దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం తెలంగాణలో లేదని స్పష్టం చేశారు. కేంద్రం పరిధిలో ఉన్న కోల్ ఇండియా కంటే సింగరేణి మెరుగైన ఫలితాలు సాధిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణి వరుసగా ఆరు సార్లు కేంద్ర ప్రభుత్వ అవార్డు తీసుకుందని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని చూస్తోంది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read : హిండెన్ బర్గ్ నివేదికపై కేంద్రానికి సుప్రీంకోర్ట్ డెడ్ లైన్….
ఏ కారణం వల్ల విశాఖ ఉక్కును అమ్మాల్సి వస్తోందంటూ నిలదీశారు. సింగరేణికి ఎందుకు గనులు కేటాయించలేదని కేంద్రాన్ని నిలదీయాలంటూ ఈటలకు కేటీఆర్ హితవు పలికారు. కొవిడ్ తర్వాత కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందన్న కేటీఆర్.. దానిపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రభుత్వ ఆస్తులను ఇద్దరు అమ్ముతున్నారు.. ఇద్దరు కొంటున్నారని మండిపడ్డారు. ముద్రా రుణాలిచ్చాం.. అద్భుతాలు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని.. పేదలకు, రైతులకు రూపాయి గ్రాంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్క ఫార్మ సంస్థ కూడా లేని యూపీ బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చారన్న కేటీఆర్… డ్రగ్ హబ్గా ఉన్న హైదరాబాద్కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము స్టార్టప్ అంటుంటే.. బీజేపీ మాత్రం ప్యాకప్ అంటోందని తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మీద హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… కేసు నమోదు, అరెస్ట్
- ఏపీ సీఎం జగన్తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ….
- సీఎం కేసీఆర్ కీలక ప్రకటన…. పోడు భూములకు రైతుబంధు, భూమి లేని వారికి గిరిజనబంధు
- ప్రగతిభవన్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్…
- కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్… త్వరలోనే అందిస్తామని మంత్రి గంగుల ప్రకటన
2 Comments