KhammamTelangana

రసవత్తరంగా ఖమ్మం జిల్లా రాజకీయం… పొంగులేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తాత మధు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిక్కార స్వరంలో వేడెక్కిన రాజకీయం.. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతో మరింత రంజుకొచ్చింది. తన అనుచరులను పార్టీ సస్పెండ్ చేయటంపై ఘాటుగా స్పందించిన పొంగులేటి.. దమ్ముంటే తనను బహిర్కరించాలంటూ బీఆర్ఎస్ అధిష్ఠానానికి సవాల్ విసిరారు. కేసీఆర్ సర్కార్‌పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతో… బీఆర్ఎస్ నేతలు పొంగులేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు హాట్ కామెంట్స్ చేశారు. పొంగులేటి వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు తాత మధు. పొంగులేటికి బీఆర్‌ఎస్ పార్టీ ఏం అన్యాయం చేసిందో బహిరంగ చర్చ కు రావాలని మధు డిమాండ్ చేశారు.

Read Also : బీఆర్ఎస్ నేత దూషించడాని…. ప్రభుత్వ మహిళా అధికారిని ఆత్మహత్యాయత్నం

పొంగులేటి చేసే రాజకీయాలన్నీ వెన్నుపోటు రాజకీయాలేనని ఆరోపించారు. “పోటుగాడు కేటుగాడుగా మారాడు. దమ్ముంటే నన్ను బహిష్కరించాలని.. కేసీఆర్‌కు, జిల్లా పార్టీకి సవాల్ విసిరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్‌ను విమర్శించేంత పోటు మొనగడా..? గత ఎన్నికల్లో పొంగులేటి అనుచరులకే సగం సీట్లు ఇచ్చింది పార్టీ. మీకు నిజంగా ప్రజాదరణ ఉంటే వాళ్లను ఎందుకు గెలిపించుకొలేదు..? జిల్లాలో పొంగులేటి తన బ్రాండ్ నడవలానుకుంటున్నాడు. బీఆర్‌ఎస్ పార్టీలో ఎవరి బ్రాండ్ నడవదు. ఒక్క కేసీఆర్ బ్రాండ్ మాత్రమే నడుస్తుంది. డబ్బు రాజకీయాలు ఖమ్మం జిల్లాలో పని చేయవు. రైతు బంధు ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఆ మాట అన్న పొంగులేటికి సంబంధించిన 108 ఎకరాలకు రైతుబంధు వస్తుంది. 2014 కన్న ముందు నీ పరిస్థితి ఏంటీ… ఇప్పుడు నీ పరిస్థితేంటీ..?” అంటూ పొంగులేటికి తాతా మధు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఈ ధనిక రాష్ట్రాన్ని నిరుపేద రాష్ట్రంగా మార్చేశారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో కార్ల స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం…

తనకు మద్దతుగా నిలిచిన కొంత మంది బీఆర్ఎస్ నేతలను సస్పెండ్ చేశారని.., దమ్ము, ధైర్యం ఇంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు. అధికారం ఎవడబ్బా సొత్తు కాదని.., అధికారులు ఆ విషయం గుర్తుంచుకోవాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. అధికారం ఎవరి చేతిలోనే ఉండదని.., అధికారం ఉంది కదా అని ఇబ్బందులకు గురి చేస్తే.. వడ్డీ కాదు చక్రవడ్డీతో తిరిగి చెల్లిస్తానని ధ్వజమెత్తారు. మరోవైపు.. తన అనుచరులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తారని పొంగులేటి గత కొంత కాలంగా చెబుతూ వస్తుండగా.. నిన్న రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. వైరా నియోజకవర్గం నుంచి బానోత్ విజయబాయి పోటీ చేస్తారని, అశ్వారావుపేట నియోజవర్గానికి జారే ఆదినారాయణ పోటీ చేస్తారని పొంగులేటి కీలక ప్రకటన చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. “కొత్త సీసాలో పాత సార పోసినట్లు”… తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల సెటైర్
  2. టర్కీ, సిరియా భూకంప దృశ్యాలు మనస్సును కలచివేస్తున్నాయి… కే‌టి‌ఆర్ ట్వీట్
  3. ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ఫోకస్… ఈ నెలలో పర్యటించనున్న కేటీఆర్, హరీష్
  4. కార్యకర్తతో బాబు మోహన్ బూతు పురాణం… ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ వార్నింగ్
  5. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు… అక్బరుద్దీన్‌తో కాంగ్రెస్ నేతల సుదీర్ఘ భేటీ

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.