International

అమెరికాలో గన్ మిస్ ఫైర్.. తెలంగాణ విద్యార్థి మృతి… ఈ ఘటనలో ట్విస్ట్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. మొన్నీమధ్యే.. చికాగోలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరువకముందే.. అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అఖిల్ సాయి మహంకాళి (25) మృతిచెందాడు. అయితే.. ఈ ఘటనలో.. ముందుగా గన్ మిస్ ఫైర్ అయ్యి చనిపోయినట్టు సమాచారం వచ్చినా.. ప్రస్తుతం కేసు మరో మలుపు తీసుకుంది. గన్ మిస్ ఫైర్ కాలేదని.. తన తోటి విద్యార్థే కాల్చాడంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : 40 రోజులుగా కనిపించని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్…

అయితే.. ఆ విద్యార్థి కూడా తెలుగు విద్యార్థే కావటం గమనార్హం. ప్రస్తుతానికి అనుమానితుడైన రవితేజ గోలి (23) ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ రవితేజ గోలి కూడా అఖిల్ సాయి ఉంటున్న ప్రదేశంలోనే ఉంటూ ఉన్నత చదువు అభ్యసిస్తున్నట్టు సమాచారం. అయితే.. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌ సాయి అనే విద్యార్థి 13 నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. కాగా.. ఎంఎస్ చదువుతూనే తన సొంత ఖర్చుల కోసం అఖిల్ సాయి.. అతను ఉంటున్న ప్రదేశానికి దగ్గర్లోనే ఉన్న ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కూడా చేస్తున్నాడు. అయితే.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో అది మిస్‌ ఫైర్‌ అయ్యి.. బుల్లెట్ తగిలిందని.. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబసభ్యులకు తెలిపారు.

Also Read : యదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి… మంత్రి కే‌టి‌ఆర్

కానీ.. ఈ ఘటనలో ట్విస్ట్ నెలకొంది. అఖిల్‌ సాయి గన్ మిస్ ఫైర్ అయ్యి చనిపోలేదని.. తోటి తెలుగు విద్యార్థి కావాలని కాల్చటం వల్లే చనిపోయాడని అక్కడి పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు.. అఖిల్‌ సాయి మృతి చెందిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. చేతికి అందొచ్చిన కొడుకు దేశం కాని దేశంలో ప్రాణాలు వదలటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రతిపక్షపార్టీల కార్యకర్తలు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు…. మిర్యాలగూడ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
  2. రసవత్తరంగా ఖమ్మం జిల్లా రాజకీయం… పొంగులేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తాత మధు
  3. బీఆర్ఎస్ నేత దూషించడాని…. ప్రభుత్వ మహిళా అధికారిని ఆత్మహత్యాయత్నం
  4. హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో కార్ల స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం…
  5. “కొత్త సీసాలో పాత సార పోసినట్లు”… తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల సెటైర్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.