Telangana

నేటి నుండే రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర… మేడారం నుండి ప్రారంభం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క- సారలమ్మ గద్దె వద్దకు రేవంత్ చేరుకోనున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడారం నుంచి రేవంత్ పాదయాత్రను స్టార్ట్ చేయనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్న రేవంత్ రెడ్డికి కూతురు నైమిష హారతి ఇచ్చారు. దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also : 2,90,396 కోట్ల మొత్తంతో భారీ బడ్జెట్…శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు

తన కూతురు హారతి ఇచ్చిన వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ రేవంత్ ఎమోషనల్ అయ్యారు. ‘ నా ప్రజాప్రస్థానంలో “యాత్ర” కీలక ఘట్టం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను. ప్రజల ఆశీర్వాదంతో నాయకుడుగా ఎదిగాను. ప్రశ్నించే గొంతుకగా వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. నన్ను నాయకుడ్ని చేసిన ప్రజల కోసం… వారి జీవితాల్లో మార్పు కోసం…“యాత్ర” గా వస్తున్నా’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ నేతలు రేవంత్ పాదయాత్రకు భారీగా ఏర్పాటు చేశారు. భారీగా శ్రేణులు మేడారంకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె వద్దకు రేవంత్ చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనుండగా.. కొత్తూరు, నార్లాపూర్‌ మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రాజెక్ట్‌నగర్‌కు చేరుకుంటారు.

Also Read : విజయమ్మతో పొంగులేటి భేటీ… పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్..???

అక్కడ భోజన విరామం తర్వాత తిరిగి పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం 4.30కు పస్రా చేరుకుంటారు. పస్రా రోడ్డు జంక్షన్‌లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పస్రా నుంచి మరో 10 కి.మీ. పాదయాత్ర నిర్వహిస్తారు. అక్కడి నుంచి వాహనంలో రాత్రి బస చేసే పాలంపేట గ్రామానికి రేవంత్‌రెడ్డి చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణలో మరో కొద్ది నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో.. రేవంత్ పాదయాత్రపై కాంగ్రెస్ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని భావిస్తున్నారు. నేతల మధ్య విబేధాలు సమసిపోతాయని, కాంగ్రెస్ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. రేవంత్ పాదయాత్రలో పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొననున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు కూడా పాదయాత్ర చేసేలా టీ కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది.ఈ పాదయాత్ర కాంగ్రెస్‌కు ఎలా కలిసొస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి : 

  1. పద్మభూషన్ అవార్డు గ్రహీత, సినీ నేపధ్య గాయని వాణి జయరాం కన్నుమూత…
  2. రాజేందరన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే.. అక్కడికి పోయినంక ఆగమైండు..” కే‌టి‌ఆర్ కీలక వ్యాక్యలు
  3. జడ్జికే లాయర్‌ షోకాజ్‌ నోటీసు… న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ చర్యలు
  4. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాలలో పోటీ… అక్బరుద్ధీన్ సంచలన ప్రకటన
  5. ఏపీ చలనచిత్ర, నాటక మరియు టి‌వి అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా పోసాని…

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.