
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గత కొంతకాలంగా అధికార బీఆర్ఎస్పై ధిక్కారస్వరం వినిపిస్తున్న ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయితీల్లో నిధులు విడుదల కాక మహిళా సర్పంచ్లు తమ మెడలోని తాళిబొట్లు తాకట్టు పెట్టి బిల్లులు చెల్లిస్తున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు. ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు, మున్సిపాలిటీకు రూ.20 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఎక్కడ నిధులు మంజూరు చేయకుండా సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తు్న్నారన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఈ ధనిక రాష్ట్రాన్ని నిరుపేద రాష్ట్రంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన కొంత మంది బీఆర్ఎస్ నేతలను సస్పెండ్ చేశారని.., దమ్ము, ధైర్యం ఇంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు.
Read Also : ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ముగిసిన ఐటి దాడులు… కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
‘ఒక ప్రజాప్రతినిధి శ్రీనన్న గురించి, కాంట్రాక్టుల గురుంచి మాట్లాడుతున్నారు. నిజంగా మీరు వెయ్యి కోట్లు, 2 వేల కోట్ల పనులు ఇచ్చి ఉంటే నేను చర్చలకు సిద్ధం. ఎవరికి ఎంత ఇచ్చారో.. ఎవరికి ఎంత లాభం చేకూరిందో ఆ లెక్కలేంటో నేను చూపిస్తాను. మన బాగోతం ఏంటో మనకు తెలియంది కాదు. మొన్నటి వరకు ప్రతి ఫ్లెక్సీలోనూ నా ఫోటో వాడుకున్నారు. మీరు ప్రజాప్రతినిధి కావడానికి నన్ను వాడుకున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనన్న ఒక్కడే కాదు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారు.’ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. అధికారం ఎవడబ్బా సొత్తు కాదని.., అధికారులు ఆ విషయం గుర్తుంచుకోవాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. అధికారం ఎవరి చేతిలోనే ఉండదని.., అధికారం ఉంది కదా అని ఇబ్బందులకు గురి చేస్తే.. వడ్డీ కాదు చక్రవడ్డీతో తిరిగి చెల్లిస్తానని ధ్వజమెత్తారు.
Also Read : సిరియా, టర్కీలో భారీ భూకంపం… రెండు దేశాల్లో 560 మందికిపైగా మృతి
‘మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, మీరు ఆ స్థాయి కి రావడానికి ఏం ఇచ్చుకున్నారో మీరే ఆలోచించుకోండి. అధికారులు అందరికీ ఒకటే హెచ్చరిక. అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదని విషయాన్ని గమనించాలి.’ అని పొంగులేటి వ్యాఖ్యనించారు. తన అనుచరులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తారని పొంగులేటి గత కొంత కాలంగా చెబుతున్నారు. తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని తాను కాపాడుకుంటానని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. వైరా నియోజకవర్గం నుంచి బానోత్ విజయబాయి పోటీ చేస్తారని నిన్న (ఆదివారం ఫిబ్రవరి 5న) పొంగులేటి సంచలన ప్రకటన చేశారు. తాజాగా… అశ్వారావుపేట నియోజవర్గానికి తన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. జారే ఆదినారాయణ అశ్వరావుపేట నుంచి పోటీ చేస్తారని పొంగులేటి కీలక ప్రకటన చేసారు. ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Read Also : నియోజకవర్గానికి 2000 మంది లబ్ధిదారులకు 3 లక్షల ఆర్ధిక సహాయం…. దళితబంధుపై కీలక ప్రకటన
ప్రస్తుతానికి బీఆర్ఎస్లోనే ఉన్న పొంగులేటి ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. కానీ గత కొంత కాలంపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకమవుతున్నారు. ఆయన బీజేపీలో చేరతారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆయన వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మతో భేటీ కావటంతో ఆయన వైఎస్సాఆర్టీపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగానే.. తాజాగా తన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తూ సంచలనాలకు తెరలేపారు. దీంతో ఆయన ఏదైనా పార్టీలో చేరతారా ? లేక ఇండిపెండెంట్గా పోటీ చేయిస్తారా ? కాకపోతే ఆయనే సొంత పార్టీ పెడట్టనున్నారా ? అనే సందిగ్ధత రాజకీయ వర్గాల్లో నెలకొంది.
ఇవి కూడా చదవండి :
- రైతు బజారా??… చోరీ బజారా….??…. ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్లే ఈ అగంతకుల టార్గెట్…!!
- ఎంఎల్ఏల కొనుగోలు కేసులో హైకోర్ట్ కీలక తీర్పు… ప్రభుత్వ అప్పీల్ తిరస్కరణ
- నేటి నుండే రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర… మేడారం నుండి ప్రారంభం
- 2,90,396 కోట్ల మొత్తంతో భారీ బడ్జెట్…శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
- రాజేందరన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే.. అక్కడికి పోయినంక ఆగమైండు..” కేటిఆర్ కీలక వ్యాక్యలు
2 Comments