
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్కు తన మిత్రపక్షమైన ఎంఐఎం షాక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ పొత్తు పెట్టుకుని కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. కాగా.. ఏడు స్థానాల్లో విజయం సాధించింది. కాగా.. ఈసారి మాత్రం బీఆర్ఎస్ దోస్తీకి ఎంఐఎం కటీఫ్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. అందుకు ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలే నిదర్శనంగా కన్పిస్తున్నాయి. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వర్సెస్ మంత్రి కేటీఆర్గా జరిగిన చర్చ.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Also : విజయమ్మతో పొంగులేటి భేటీ… పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్..???
అయితే.. సీఎం కేసీఆర్, మంత్రులు తమకు అపాయింట్మెంట్ ఇవ్వరంటూ అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినే కలుస్తామంటూ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుకు, జీఎస్టీ వద్దన్నామని.. తమకు మెుదట్నుంచి అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని.. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి గంటలు గంటలు సమయం ఇవ్వటం సరికాదన్నారు. శానససభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతకు ముందు అక్బర్ బాగానే మాట్లాడేవాడని ఇప్పుడు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావటం లేదన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు.
Also Read : పద్మభూషన్ అవార్డు గ్రహీత, సినీ నేపధ్య గాయని వాణి జయరాం కన్నుమూత…
వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమకు కేవలం ఐడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఎక్కువ సీట్లలో పోటీ చేసే ప్రయత్నం చేస్తాం. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఉండేలా చూస్తాం. అంటూ అక్బరుద్దీన్ ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక ఉన్న ఆంతర్యమేంటని శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటి వరకు మిత్ర పక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ.. కట్ అయినట్టేనా అన్న చర్చకు తెరలేచింది. మరోవైపు.. బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగమే ఈ ప్రకటననా.. లేక నిజంగానే విడివిడిగా పోటీ చేయనున్నారా అన్నది క్లారిటీ రావాల్సిఉంది. ఒకవేళ ఎంఐఎం విడిగా పోటీ చేస్తే.. బీఆర్ఎస్కు నష్టం జరగనుందా.. అన్నది కూడా విశ్లేషిస్తున్నాయి శ్రేణులు.
ఇవి కూడా చదవండి :
- జడ్జికే లాయర్ షోకాజ్ నోటీసు… న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ చర్యలు
- రాజేందరన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే.. అక్కడికి పోయినంక ఆగమైండు..” కేటిఆర్ కీలక వ్యాక్యలు
- అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం… అక్బర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్
- అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో… ఇద్దరు మహిళలు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
- అత్యధిక అప్పులున్న మంత్రుల జాబితా… 6వ స్థానంలో కేటిఆర్
Amazing