HyderabadTelangana

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం… రామాంతపూర్‌లోని ఈజీ ఫ్లైవుడ్ గోదాంలో మంటలు

క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం, నూతన సెక్రటేరియట్ అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే తాజాగా.. మరో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. రామాంతపూర్‌లోని ఈజీ ఫ్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉన్నట్లుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. వేగంగా వ్యాపిచంటంతో గోదాం మొత్తం కాలి బూడిదైంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also : ఏపీ చలనచిత్ర, నాటక మరియు టి‌వి అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా పోసాని…

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తుండగా… ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెల సికింద్రాబాద్ దక్కన్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారీగా ఎగిసి పడిన మంటలు, పొగతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు దాదాపు నాలుగు రోజుల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకోగా.. ఒకరి అస్థిపంజరం దొరికింది. మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు. అగ్ని ప్రమాద ఘటనలో బిల్డింగ్ మెుత్తం దెబ్బతినటంతో అధికారులు దాన్ని కూల్చివేశారు. రెండ్రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీఎస్‌టీలోని అన్నపూర్ణ బార్ సమీపంలోని ఓ గోదాంలోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించడంతో చీకటిమయంగా మారాయి. ఒక్కసారిగా మంటలు రావడం, పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Also Read : కేఏ పాల్ శాపం వల్లే సచివాలయం తగలబడిందా?

మంటలు రావడంలో స్థానిక గోడౌన్‌కు సమీపంలోని ప్రజలు పరుగులు తీశారు. శుక్రవారం నాడు నూతన సెక్రటేరియట్‌లోనూ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారు జామున ఉన్నట్లుండి మంటలు వ్యాపిచటంతో అధికారులు పరుగులు తీశారు. 11 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈనెల 17న సెక్రటేరియట్ ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా.. ఇంతలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘనటపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా హడావుడిగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయటంతో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. ఇలా హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు నగర ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. చలికాలంలోనే ఇలా వరసు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే.. వచ్చేది ఎండకాలమని.. అప్పుడు పరిస్థితి ఏంటని భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఇంకా విషమంగానే తారకరత్న… విదేశాలకు తరలించే ఛాన్స్
  2. అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం… ఈటల రాజేందర్‌తో ప్రత్యేకంగా ముచ్చటించిన కే‌టి‌ఆర్
  3. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు….
  4. బీభత్సం సృష్టించిన గంజాయి స్మగ్లర్లు… 21 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
  5. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్… భారీగా చేరుకున్న ఐటీ అధికారులు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.