Telangana

రాజేందరన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే.. అక్కడికి పోయినంక ఆగమైండు..” కే‌టి‌ఆర్ కీలక వ్యాక్యలు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వాడీవేడిగా సాగుతున్న సమావేశాల్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు తమ కుటుంబంపై చేస్తున్న విమర్శలపై స్పందించిన కేటీఆర్.. అవును.. మాది కుటుంబ పాలనేనని క్లారిటీ ఇచ్చారు. అయితే.. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది తమ కుటుంబమేనంటూ చమత్కరించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్.. పోడు భూముల విషయంలో తప్పుబట్టాల్సి వస్తే.. అది కాంగ్రెస్‌నే అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి నీళ్లకు ఇబ్బంది ఉండేదని.. ఊరు వెళ్దామంటే భయపడాల్సి పరిస్థితి ఉండేదన్నారు.

Read Also : అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం… అక్బర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్

మిషన్ భగీరథ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కేటీఆర్ వివరించారు. మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టిందని.. హర్ ఘర్ జల్ పేరుతో నీళ్లు ఇస్తున్నానని కేంద్రం చెప్తోందన్నారు. ఇంటింటికి ఇళ్లు ఇవ్వండి కానీ.. విషం నింపకండి అంటూ కేటీఆర్ హితవు పలికారు. రాష్ట్రంలో దక్షతతో తాము పని చేస్తుంటే.. కేంద్రం మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ కేటీఆర్ మండిపడ్డారు. పీఎఫ్‌సీ, ఆర్ఈసీలకు ఫోన్ చేసి రుణాలు ఇవ్వొద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి కక్ష ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసం చెబుతున్నారన్న భట్టి వ్యాఖ్యలపై కేటీఆర్ గట్టిగానే స్పందించారు. “మేము కేసీఆర్ కార్యకర్తలం. మునుగోడు ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి కోసం అందరం పని చేశాం. గుజరాత్‌లో ఎన్నికలుంటే రాహుల్ గాంధీ మాత్రం పక్క నుంచి వెళ్లిపోయారు. మీ నాయకుడిలా అస్త్ర సన్యాసం చేయం.” అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

Also Read : అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో… ఇద్దరు మహిళలు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌పై మరోసారి ఆసక్తికర కామెంట్లు చేశారు కేటీఆర్. “రాజేందరన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే.. అక్కడికి పోయినంక ఆగమైండు..” అంటూ తనదైన శైలిలో చురకలంచించారు. దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మంత్రి కేటీఆర్ వివరించారు. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేదన్నారు. తెలంగాణలో కరెంట్‌ కష్టాలు.. తాగునీటి తిప్పులు లేవన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్‌ వైపు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిధుల వరద పారుతోందని.. నియమాకాల కల సాకారమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీల్లో 9 గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని వివరించారు.

ఇవి కూడా చదవండి : 

  1. అత్యధిక అప్పులున్న మంత్రుల జాబితా… 6వ స్థానంలో కే‌టి‌ఆర్
  2. హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం… రామాంతపూర్‌లోని ఈజీ ఫ్లైవుడ్ గోదాంలో మంటలు
  3. కేఏ పాల్ శాపం వల్లే సచివాలయం తగలబడిందా?
  4. ఏపీ చలనచిత్ర, నాటక మరియు టి‌వి అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా పోసాని…
  5. ఇంకా విషమంగానే తారకరత్న… విదేశాలకు తరలించే ఛాన్స్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.