Telangana

రేవంత్ రెడ్డిపై ఢిల్లీ హైకమాండ్‌కు కోమటిరెడ్డి ఫిర్యాదు… వాల్ పోస్టర్ల వ్యవహారంపై సీరియస్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్సెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల వెంకటరెడ్డి నేరుగా గాంధీభవన్‌కు వెళ్లడం, రేవంత్‌తో భేటీ కావడంతో.. వారిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని హస్తం శ్రేణులు భావించారు. గత కొంతకాలంగా రేవంత్, వెంకటరెడ్డి మధ్య ఉప్పనిప్పుగా వ్యవహారం నడుస్తున్న క్రమంలో.. ఇద్దరూ కలిసిపోవడం కాంగ్రెస్ శ్రేణులకు సరికొత్త ఉత్సాహనిచ్చింది. టీ కాంగ్రెస్‌లో నేతల మధ్య విబేధాలు తొలగిపోతాయని, ఇద్దరూ కలిసి పనిచేస్తారని కార్యకర్తలు భావించారు. కానీ వావరి ఆశలు కొద్దిరోజుల్లో ఆవిరయ్యాయి. రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి మధ్య మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. తాజాగా రేవంత్ రెడ్డిపై ఢిల్లీ హైకమాండ్‌కు కోమటిరెడ్డి ఫిర్యాదు చేశారు.

Read Also : నేటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు… గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం

తనకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు ఏర్పాటు చేయించారంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు వెంకటరెడ్డి కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఆయన.. ఏఐసీసీ అగ్రనేతలను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డితో మాట్లాడతామని అగ్రనేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు హల్‌చల్ చేశాయి. కోవర్టు వెంకటరెడ్డి అంటూ పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. వెంకటరెడ్డి కోవర్టు పాలిటిక్స్ చేస్తున్నారని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ఉపఎన్నికలో బహిరంగంగా మద్దతు ఇచ్చారని, అయినా వెంకటరెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ పోస్టర్లు నల్గగొండ పాలిటిక్స్‌లో ప్రకంపనలు సృష్టించడంతో.. వెంకటరెడ్డికి దృష్టికి వెళ్లింది.

Also Read : సీఎం కేసీఆర్ కు వైఎస్ షర్మిల సూపర్ గిఫ్ట్.. రాజకీయ వర్గాల్లో సంచలనం

దీంతో దీనిపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పోస్టర్లను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయించినట్లు వెంకటరెడ్డి అనుమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకే కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్‌లోని సభ్యుడి సహాయంతో కొంతమంది వ్యక్తులు ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు. సునీల్ కనుగోలుతో కూడా ఈ విషయం గురించి తాను ఆరా తీశానని, ఆయన తనకు క్షమాపణలు చెప్పారని వెంకటరెడ్డి చెబుతున్నారు. టీ కాంగ్రెస్‌లో ముఖ్యనేతలుగా రేవంత్, కోమటిరెడ్డి ఉన్నారు. వారిద్దరి మధ్య విబేధాలు సమిసిపోయాయని భావిస్తున్న తరుణంలో.. మళ్లీ కొత్త వార్ స్టార్ట్ కావడం హస్తం శ్రేణులన ఆందోళన కల్గిస్తోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ కలిసి పనిచేస్తామని ఇటీవల చెప్పిన వెంకటరెడ్డి.. మళ్లీ ఎప్పటిలాగే రేవంత్‌తో శత్రుత్వం కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. సీతక్క ఇలాఖా నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర.. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
  2. యాదగిరి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలకు డీజీపీ హామీ
  3. గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారు…. దరఖాస్తుకు రేపే చివరి తేదీ
  4. ఢిల్లీ లిక్కర్ స్కాం రెండో ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ సీఎం పేరు
  5. ఏ‌టి‌ఎం నుండి దొంగనోట్లు…. హైద్రాబాద్ ఉప్పల్ లో ఘటన

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.