Telangana

ఏ‌టి‌ఎం నుండి దొంగనోట్లు…. హైద్రాబాద్ ఉప్పల్ లో ఘటన

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బ్యాంకులపై ఎక్కువగా అందరికీ నమ్మకం ఉంటుంది. బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే సేఫ్ అని భావిస్తారు. అత్యంత భద్రత ఉంటుందనే భరోసాతో ఉంటారు. ఇంట్లో డబ్బులు ఉంచుకుంటే దొంగల బెడద ఉంటుందని, బ్యాంకుల్లో అయితే ఎక్కడికి పోవని ధైర్యంతో ఉంటారు. అవసరమైనప్పుడల్లా ఎక్కడైనా అకౌంట్‌లోని డబ్బులు తీసుకొవచ్చని అందరూ ఏటీఎం కార్డులు వినియోగిస్తూ ఉంటారు. ప్రతీచోట ఏటీఎంలు ఉండటంతో.. నగదు అవసరమైనప్పుడు ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటారు. కానీ తాజాగా జరిగిన ఓ సంఘటనతో ఏటీఎం వినియోగదారులు, బ్యాంకుల కస్టమర్లు ఆశ్చర్యపోయారు. ఏటీఎం నుంచి దొంగనోట్లు వచ్చిన సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read : టార్గెట్ అదాని… పార్లమెంట్ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన బి‌ఆర్‌ఎస్

ఉప్పల్ పరిధిలోని ప్రశాంత్ నగర్ ఎస్‌బీఐ ఏటీఎం నుంచి దొంగనోట్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేయగా.. దొంగనోట్లు వచ్చినట్లు కొంతమంది ఖాతాదారులు గుర్తించారు. దీంతో వెంటనే ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేయగా.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు సిబ్బంది సమాచారంతో ఏటీఎం కేంద్రానికి పోలీసులు చేసుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఏటీఎంలో దొంగనోట్లు ఎవరు పెట్టారు..? ఎలా పెట్టారు? అనే దానిపై విచారణ చేపడుతున్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టే సంస్థకు చెందిన సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏటీఎంలలో బ్యాంకు అధికారులు డబ్బులు పెట్టరు. కొన్ని సంస్థలకు ఇలాంటి బాధ్యతలను బ్యాంకులు అప్పగిస్తూ ఉంటాయి. ఈ సేవలు అందించేందుకు అనేక సంస్థలు ఉన్నాయి.

Read Also : ‘కార్తీకదీపం’ సీరియల్ తో కష్టాలు.. కస్టమర్ చేతి వేలు కొరికిన దుకాణ యజమాని

ఆ సంస్థకు సంబంధించిన సిబ్బంది వాహనాల్లో వచ్చి డబ్బులు పెట్టి వెళుతూ ఉంటారు. డబ్బులు ఖాళీ అయినప్పుడల్లా సమాచారం తెలుసుకుని ఏంటీఎంలలో డబ్బులు పెడతారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టిన సంస్ధ సిబ్బంది ఈ నేరానికి పాల్పడి ఉంటారా? అనేది కూడా అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ మొత్తం పరిశీలించిన తర్వాత ఎవరు పెట్టారనేది తెలిసే అవకాశం ఉంది. దొంగనోట్లు బయటపడటంతో ఏటీఎం వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొంతమంది దొంగనోట్లు అని గుర్తించకుండా తీసుకెళ్లి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఏటీఎంలు చోరీకి గురి కావడం లేదా ఏటీఎంలను పగులగొట్టి నగదును దొంగతనం చేయడం లాంటివి తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతూ ఉంటాయి. కానీ ఏకంగా బ్యాంకు ఏటీఎం నుంచే దొంగనోట్లు రావడంతో ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై బ్యాంకు అధికారులు కూడా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. సమతా స్పూర్తి కేంద్రంలో నేటి నుంచి సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు…
  2. సీఎం కేసీఆర్‌తో జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ జోగి భేటీ
  3. నేటి నుండి ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్ర…
  4. ఈటలపై అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
  5. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మోసం చేశారు… మరోసారి పొంగులేటి సంచలన కామెంట్స్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.