
నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురైన హీరో నందమూరి తారకరత్నకు బెంగళూరు నారాయమ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఎక్మో చికిత్స చేయడం లేదని.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు ప్రకటించారు. తాజాగా తారకరత్న హెల్త్ కండీషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రొడ్యూసర్ సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉండే ప్రసన్న కుమార్ చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి.
తారకరత్న కోలుకుంటున్నారని.. కాళ్ళు , చేతులు కదుపుతున్నారని ప్రసన్న కుమార్ చెప్పారు. ఆపస్మాకర స్దితిలో ఉండి బాలకృష్ణ మాట వినిన వెంటనే చలించారని తెలిపారు. కుప్పంలో దాదపు 45 నిమిషాలు గుండె ఆగిందని..బాలకృష్ణ వెళ్ళి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివారని అన్నారు. బాలకృష్ణమృత్యంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందన్నారు. తారకరత్న చేతి వేళ్ల, కదలికలు ఉంటే మెదడు కూడా బాగానే పనిచేస్తుందని డాక్టర్లు అన్నారన్నారు. తారకరత్న వంద శాతం సేఫ్ గా ఉన్నారని స్పష్టం చేశారు.సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దన్నారు ప్రసన్న కుమార్.
యువగళం వలన డిక్లేర్ చేయటం లేదనే వార్తలు అవాస్తవం అన్నారు ప్రసన్న కుమార్. సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ లేని యాక్టర్ తారకరత్న అన్నారు. తారకరత్న కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రార్దనలు చేస్తున్నారని తెలిపారు. కుటుంబం అంతా దగ్గరుండి మానెటరింగ్ చేస్తున్నారని అన్నారు.బ్రెయిన్ ఫక్ంక్షనింగ్ ఎంత టైం పడుతుంది అనేది డాక్టర్లు నిర్దారించలేరు అన్నారు.ఎక్మో , స్టంట్ అనేదే జరగలేదు..హార్ట్ , కిడ్నీ , లివర్ పర్ఫెక్ట్ గా పని చేస్తున్నాయి..సోషల్ మీడియాలో వచ్చే మెలీనా , స్మెల్ వస్తుంది అనే మాటలు పచ్చి అబద్దంఫేక్ ప్రచారాలు ఆపండి అంటూ ప్రకటన చేశారు తుమ్మల ప్రసన్న కుమార్.