
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్లో ముగిసింది. ఈ సందర్భంగా శ్రీనగర్లోని లాల్చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని రాహుల్ గాంధీ ఎగురువేశారు. అనంతరం మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీలు, న్యాయవ్యవస్థ, మీడియాపైనా బీజేపీ దాడులు చేస్తోందని మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన మాత్రమే కాదని… సామాన్యుల ఉద్యమంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇంతటితో భారత్ జోడో యాత్ర ముగియలేదని, ఇది కొత్త ప్రారంభానికి తొలి అడుగు అని రాహుల్ ఉద్ఘాటించారు.
Read Also : తారకరత్నకు నేడు కీలక వైద్య పరీక్షలు….ఆతరువాతే స్పష్టత
జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సక్రమంగా ఉంటే.. బీజేపీ నేతలు లాల్చౌక్ వరకు ఎందుకు యాత్ర చేయరని రాహుల్ ప్రశ్నించారు. నిజంగా భద్రత మెరుగుపడితే జమ్మూ నుంచి శ్రీనగర్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎందుకు నడవరని ఆయన నిలదీశారు. భద్రతా వైఫల్యం ఉందని గతవారం రాహుల్ గాంధీ తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం అనంత్నాగ్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించగా.. భారీగా జనం హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ యాత్రలో పాల్గొన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలను సైతం లెక్కచేయకుండా రాహుల్ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించడంతో వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో యాత్రను నిలిపివేయాలని రాహుల్ను పోలీసులు కోరారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
Also Read : గవర్నర్పై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం… బడ్జెట్కు ఆమోదం తెలపకపోవడంపై పిటిషన్
భద్రత విషయంలో జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టింది. ఇక, భారత్ జోడో యాత్ర తనకెంతో గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. దేశంలోని రైతులతో పాటు నిరుద్యోగ యువత సమస్యలను తాను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నానని రాహుల్ చెప్పారు. అలాగే, సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన గురించి ప్రస్తావించారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా అక్రమంగా భారత భూభాగాన్ని ఆక్రమించిందని రాహుల్ ఆరోపించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని కేంద్రం బహిరంగంగా అంగీకరించడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. చైనాతో మరింత కఠినంగా వ్యవహరించాలని, లేదంటే డ్రాగన్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
- ఉత్తమ వైద్య సేవలలో దేశంలో తెలంగాణకు మూడవ స్థానం…. హరీష్ రావు
- చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఆహ్వానం.. ఏపీలో సంచలనం
- ఒడిశా మంత్రిపై కాల్పులు.. పరిస్థితి విషమం
- గుజరాత్ పోటీ పరీక్ష పేపర్ హైదరాబాద్లో లీక్… 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నల్గొండ బీఆర్ఎస్ లో వర్గ పోరు.. ఎమ్మెల్యేలకు సీనియర్ల షాక్ లు!
One Comment