
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనను తనను నమ్ముకున్న కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. మధిర నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పొంగులేటి అధికారమదంతో కొందరు తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. బీఆర్ఎస్ పెద్దల మాట విని.. లక్షల మందితో ఆ పార్టీలో చేరితే నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాభిమానం పొందలేని కొందరి ఓటమికి తానే కారణమని చెప్పి ఎంపీ టికెట్ ఇవ్వలేదని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాతో పాటు నన్ను నమ్ముకున్న కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు.
Read Also : పెండింగ్ బిల్లులు రావడం లేదని సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం…
ఎన్నికలకు మందు వాగ్దానాలు చేయటమే తప్ప చేసిన వాగ్దానాలు నెరవేర్చామా ? ఈ నాలుగేళ్లులో ఇప్పటి వరకు రుణమాఫీ ఎంత చేశామనేది చూస్తే.. చేసింది కేవలం 20 శాతం మాత్రమే. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ వస్తుందా ?. ఇచ్చిన హామీలపై ఆత్మపరీశీలన చేసుకోవాలి. అధికారం ఎవడబ్బ సొత్తు కాదు. తలరాత ఏదైతో ఉందో అది జరిగి తీరుతుంది. రాబోయే కురుక్షేత్రంలో శీనన్న పెట్టిన అభ్యర్థులందరూ గెలిచి తీరుతారు. అధికార పార్టీ నాయకులు తమను ఇబ్బంది పెట్టదల్చుకుంటే పెట్టుకోవచ్చు. శీనన్న వెనకడుగు వేసేదెలే. శీనన్న ఒంటిరివాడు కాదు. శీనన్న వెనుక లక్షలాది గుండెలున్నాయి.’ అని పొంగులేటి సంచలన కామెంట్స్ చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా ఖమ్మంలో మెజారిటీ స్థానాలు గెలిపించుకున్నానని పొంగులేటి గతంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం తమకు నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు.
Also Read : గవర్నర్ విషయంలో వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు… గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు
తనతో పాటు తన ఫాలోవర్స్లో ఒక్కరికి కూడా పదవులు ఇప్పించుకోలేకపోయానని బాధపడ్డారు. 2018 ఎన్నికల్లో కూడా తన ఫాలోవర్స్కు టికెట్ దక్కలేదన్నారు. 2019 ఎన్నికల్లో కూడా.. ఒక పార్టీకి రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. పదవులు ఇవ్వక పోయినా.. కేసీఆర్ మాటలకు విలువ ఇచ్చి పార్టీలో కొనసాగినట్టు పొంగులేటి తెలిపారు. కాగా.. పొంగులేటి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగినా.. ఇటీవల వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఆయన భేటీ అయ్యారు. దీంతో ఆయన వైఎస్సాఆర్టీపీలో చేరుతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే.. ప్రస్తుతానికి బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న పొంగులేటి ఖమ్మం జిల్లాలోని నియోజవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠగా మారింది.
ఇవి కూడా చదవండి :
- మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అరెస్ట్
- కమలం పార్టీలో కోవర్టుల కలకలం…. తలలు పట్టుకుంటున్న కాషాయ నేతలు
- కమలం పార్టీలో కోవర్టుల కలకలం…. తలలు పట్టుకుంటున్న కాషాయ నేతలు
- భారత్ జోడో యాత్ర కేవలం ఆరంభం మాత్రమే… రాహుల్ గాంధీ
- జపాన్ లో వంద రోజులు ఆడిన తొలి భరతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు…
One Comment