
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : తెలంగాణలో తొలిసారి జీరో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ ప్రకటింటింది. శుక్రవారం 3,690 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. ఒక్కరికి కూడా వైరస్ సోకలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా వైరస్ ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత జీరో కొవిడ్ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి అని ఆయన స్పష్టం చేశారు. కరోనా మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో రోజూ వందలు, వేల సంఖ్యలో కేసులు నమోదయ్యేవని శ్రీనివాసరావు గుర్తు చేశఆరు. ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు గరిష్టంగా ఒక రోజులో 15 కేసులు నమోదు అయ్యాయని.., తాజాగా కేసుల సంఖ్య జీరోకు పడిపోయింనది తెలిపారు.
Also Read : ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్
ఇప్పటి వరకు రాష్ట్రంలో 8.41 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 8.37 లక్షల మంది కోలుకున్నట్లు చెప్పారు. కేసులు తగ్గినంత మాత్రాన ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. కరోనా మహ్మమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వంతో ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించటం, మాస్కులు ధరించటం వంటివి చేయడం మంచిదని సూచించారు. ప్రపంచంలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వేలు, లక్షల సంఖ్యలో వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలోనూ కరోనా మహమ్మారి విధ్వసం సృష్టించింది. మూడేళ్ల క్రితం రోజూ పదుల సంఖ్యలో నమోదైన కేసులు కొన్ని రోజుల్లోనే వందలు, వేలు దాటాయి. ఆ తర్వాక కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి.
ఇవి కూడా చదవండి :
- రధ సప్తమి వేళ తిరుమలకు పోటేత్తిన భక్త జనం… సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం
- అభిమాని సెల్ ఫోన్ విసిరేసిన రణ్ బీర్ కపూర్.. వీడియో వైరల్
- కళ్యాణ మండపంలో చూస్తుండగానే పగిలిన ఫ్లోర్ టైల్స్.. భయంతో పరుగులు
- వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు…..
- షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…