Andhra Pradesh

తారకరత్నకు ఎక్మోపై వైద్యం… బెంగళూరు నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నందమూరి తారకరత్నకు బెంగళూరు బొమ్మసంద్రలో ఉన్న నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కుప్పం నుంచి అర్ధరాత్రి తర్వాత 2.30 గంటలకు అంబులెన్స్‌లో చేరుకున్నారు. అంబులెన్స్‌తో పాటూ నందమూరి బాలకృష్ణ, తారక రత్న భార్య అలేఖ్య రెడ్డిలు కూడా ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో డాక్టర్ల టీమ్ పర్యవేక్షణలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. తారకరత్నకు వైద్యులు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్(ఐసీసీయూ)‌లో వైద్యం అందిస్తున్నారు. ఆయనకు ఎక్మోపై వైద్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తారకరత్న రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఎక్మో అమర్చడం వల్ల ఆర్టిఫిషియల్‌గా శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్ అందుతుంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రివర్గాలు ఇవాళ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Read Also : ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్

మరోవైపు సాయంత్రం 4.30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగళూరు రానున్నట్లు తెలుస్తోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి, చికిత్సను నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. శుక్రవారం వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి తారకరత్న, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలతో కలిసి ముందుకు సాగారు. అనంతరం బాబునగర్‌ దగ్గర మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మళ్లీ తిరిగి పాదయాత్ర ప్రారంభించారు.. కొంతదూరం నడిచిన తర్వాత.. నందమూరి తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు అప్రమత్తం అయ్యారు.. కిందపడిపోయిన తారకరత్నను దగ్గరలో ఉన్న కేసీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. అక్కడ ప్రాథమికంగా వైద్యం అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో పీఈఎస్‌ మెడికల్‌ ఆస్పత్రికి తరలించారు.

Also Read : తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు… మూడేళ్ల తర్వాత తొలిసారి

అక్కడి వైద్యులు తారకరత్నను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ట్రీట్మెంట్ అందించారు.. ముందు కుప్పంలోని ఆస్పత్రిలోనే ఉంచి వైద్యం కొనసాగించాలని భావించారు. ఇటు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కుప్పం ఆస్పత్రికి చేరుకున్నారు.. కొద్దిసేపటికే నారా లోకేష్ తొలి రోజు పాదయాత్ర ముగించుకుని తారకరత్న చికిత్సపొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ముందు అక్కడే ఉంచి వైద్యం కొనసాగించాలని భావించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం.. కుప్పం పీఈఎస్ వైద్యుల సలహా మేరకు శుక్రవారం రాత్రి తారకరత్నను బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అధునాతన వైద్య సౌకర్యాలున్న అంబులెన్సులో తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి : 

  1. కొడుకు భార్యను పెళ్లాడిన వృద్ధుడు
  2. కళ్యాణ మండపంలో చూస్తుండగానే పగిలిన ఫ్లోర్ టైల్స్.. భయంతో పరుగులు
  3. రధ సప్తమి వేళ తిరుమలకు పోటేత్తిన భక్త జనం… సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం
  4. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
  5. బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం మాయం… కేసు నమోదు చేసిన పోలీసులు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.