National

21 దీవులకు 21 సైనికవీరుల పేరు పెట్టిన ప్రధాని మోదీ… 21 మంది కూడా ‘పరమ్‌ వీర్‌ చక్ర’ గ్రహీతలు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన ‘పరాక్రమ్ దివస్’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారత సైనికులు గర్వపడే పనిచేశారు. అండమాన్ నికోమార్‌లో 21 దీవులకు 21 మంది సైనికవీరుల పేర్లు పెట్టారు. ఈ 21 మంది కూడా ‘పరమ్‌ వీర్‌ చక్ర’ గ్రహీతలు కావడం విశేషం. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటివరకూ పేర్లు లేని దీవులకు.. పరిమాణంలో పెద్ద నుంచి చిన్న క్రమంలో వరుసగా తొలి పరమ్‌వీర్ చక్రతో మొదలుకొని 21 మంది వీరుల పేర్లు పెట్టారు. అంతేకాకుండా.. 2018లో రాస్ ఐలాండ్స్ పేరును ప్రధాని మోదీ ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్’గా నామకరణం చేశారు.

Read Also : గోడలపై మూత్రం పోశారా?.. ఇక అంతే సంగతులు

ఇప్పుడు అక్కడ నేతాజీ గౌరవార్థం ఒక జాతీయ స్మారకం నిర్మించాలని తలపెట్టారు. ఈ స్మారకం నమూనాను మోదీ ఆవిష్కరించారు. ‘ఈ అండమాన్‌ గడ్డ మీదే మొదటిసారి భారత త్రివర్ణపతాకం రెపరెపలాడింది. స్వతంత్ర భారతదేశానికి చెందిన ప్రభుత్వం మొదట ఇక్కడే ఏర్పాటైంది. ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతి. ఈ రోజును దేశం పరాక్రమ్‌ దివస్‌గా నిర్వహిస్తోంది’ అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. ‘ఈ 21 మంది సైనికవీరులకు దేశమే అన్నింటి కంటే ముఖ్యం. ఆ తర్వాతే మిగతాది. వారికి ఈ పేర్లు పెట్టడం ద్వారా వారి సంకల్పం ఎప్పటికీ నిలిచి ఉండేలా చేశాం. ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మొదలుకొని భారత సైన్యం పరాక్రమం వరకు ప్రతిబింబిస్తుంది’ అని మోదీ అన్నారు. సోమవారం (జనవరి 23) ఉదయం వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు.

Also Read : రాజమౌళికి జేమ్స్ కేమరూన్ బంపరాఫర్….

అండమాన్ దీవుల్లో పేరులేని పెద్ద దీవికి మొదటి పరమ్‌ వీర్ చక్ర గ్రహీత ‘మేజర్ సోమ్‌నాథ్‌ శర్మ’ పేరుతో నామకరణం చేశారు. 1947 నవంబర్ 3న శ్రీనగర్ విమానాశ్రయం వద్ద పాక్‌ చొరబాటుదారులతో పోరాడుతూ ఆయన వీరమరణం చెందారు. రెండో అతి పెద్ద దీవికి రెండో పరమ్ వీర్ చక్ర గ్రహీత నాన్స్ నాయక్ ‘కరమ్ సింగ్’ పేరు పెట్టారు. ఇలా మొత్తం 21 దీవులకు 21 అమరవీరుల పేర్లు పెట్టారు. అవి: 1) మేజర్ సోమనాథ్ శర్మ
2) సుబేదార్, లాన్స్ నాయక్ కరమ్ సింగ్
3) లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే
4) నాయక్ జాదునాథ్ సింగ్
5) హవల్దార్ మేజర్ పీరు సింగ్
6) కెప్టెన్ జీఎస్ సలారియా
7) లెఫ్టినెంట్ కల్నల్ (నాటి మేజర్) ధన్ సింగ్ థాపా
8) సుబేదార్ జోగిందర్ సింగ్
9) మేజర్ షైతాన్ సింగ్
10) సీక్యూఎంహెచ్ అబ్దుల్ హమీద్
11) లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపోర్
12) లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా
13) మేజర్ హోషియార్ సింగ్
14) 2వ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్
15) ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్
16) మేజర్ రామస్వామి పరమేశ్వరన్
17) నాయబ్ సుబేదార్ బనా సింగ్
18) కెప్టెన్ విక్రమ్ బాత్రా
19) లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే
20) సుబేదార్ మేజర్ (నాటి రైఫిల్‌మ్యాన్) సంజయ్ కుమార్
21) సుబేదార్ మేజర్ రిటైర్డ్, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్

ఇవి కూడా చదవండి : 

  1. జీవో నెంబర్ 317 అనైతికమని వ్యాఖ్య… కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
  2. పాలమూరు వేదికగా బీజేపీ బడా స్కెచ్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఎన్నికల రోడ్ మ్యాప్!!
  3. హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు..
  4. రేపు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన… భారీగా ఏర్పాట్లు చేస్తున్న జనసేన నేతలు
  5. ‘టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి’.. కుండబద్దలు కొట్టిన మాజీ మంత్రి

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.