NationalTelangana

తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం… షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడం, కారులో ఉండగానే క్రేన్‌తో తీసుకెళ్లడం, పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటనలపై ఆమెను పరామర్శించారు. దాడి, అరెస్ట్ ఘటనలపై షర్మిలకు మోదీ తన సానుభూతి వ్యక్తం చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు షర్మిలతో మోదీ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తీరు గురించి మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Read Also : ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నేడు కవిత వివరణ… హైదరాబాద్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందంటూ గట్టిగా ప్రశ్నిస్తున్న షర్మిలకు మోదీ ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షర్మిల బీజేపీ వదిలిన బాణం అంటూ రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో మోదీ ఫోన్ చేయడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో అనేక అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. వైఎస్సార్‌టీపీ పేరుతో కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తానంటూ పాదయాత్ర చేస్తోన్న షర్మిలకు తొలిసారి మోదీ ఫోన్ చేయడం విశేషంగా మారింది. సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన జీ-20 సన్నాహాక సమావేశానికి ఏపీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా షర్మిలపై జరిగిన దాడి ఘటన, అరెస్ట్ వ్యవహారాలపై మోదీ ఆరా తీసినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు ప్రసారమయ్యాయి. షర్మిలపై జరిగిన దాడి ఘటనను ఎందుకు ఖండించలేదంటూ జగన్‌ను మోదీ ప్రశ్నించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సి‌ఎం ప్రత్యేక దృష్టి….ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సి‌ఎం దూకుడు

ఇలాంటి తరుణంలో షర్మిలకు మోదీ ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటన, అరెస్ట్ వ్యవహారంపై షర్మిలతో మోదీ మాట్లాడినట్లు తెలుస్తోండగా.. వచ్చే ఎన్నికలు, కేసీఆర్ ప్రభుత్వ తీరు గురించి ఏం మాట్లాడి ఉంటారనేది చర్చనీయాంశమైంది. పాదయాత్రలో షర్మిలపై జరిగిన దాడి ఘటనపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు స్పందించారు. షర్మిలపై జరిగిన దాడి, పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు. ఒక మహిళ అని కూడా చూడకుండా కారులో ఉండగానే క్రేన్‌లో తీసుకెళ్లడం దారుణమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోలు జాతీయ మీడియాలో కూడా ప్రసారమయ్యాయి. పలు నేషనల్ మీడియా ఛానెళ్లకు కూడా ఈ ఘటనపై షర్మిల ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీంతో ఈ ఘటన మోదీకి దృష్టికి వెళ్లినట్లు కొంతమంది చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఖమ్మం జిల్లాలో వేప చెట్టు నుంచి పాలు… బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతుందని పూజలు
  2. ద్విచక్ర వాహనం పక్కన అపమన్నందుకు ఆటో డ్రైవర్ పై దాడి… డ్రైవర్ బందువులను అడ్డుకున్న పోలీసులు
  3. తెలంగాణ బీజేపీ లీడర్లకు అమిత్ షా క్లాస్!
  4. మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీసులు….
  5. పాదయాత్రలపై మనసు పారేసుకుంటున్న ప్రతిపక్ష నేతలు… ఎన్నికల మూడ్ లోకి తెలంగాణ

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.