

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించటం రాజ్యాంగాన్ని అవమానించటమేనని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయాలనుకోవటం రాజ్యంగా స్పూర్తికి విరుద్ధమని వ్యాఖ్యనించారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో నివాళులర్పించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also : ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో పొడిగింపు… మంత్రి కేటీఆర్ మరో కీలక ప్రకటన
చావనైనా చస్తాం కానీ టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని చెప్పారు. “ఆలోచించేవాడే పాలన చేయగలుగుతాడు. ప్రతి నిత్యం రాజకీయాలు మాట్లాడుకుని అసలు విషయాలు పక్కన పెడుతున్నాం. ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టాలో ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఆశీర్వదించినవారు అధికారంలోకి వస్తారు. స్పీకర్గా ఉన్నా కాబట్టి కొంత పరిమితికి లోబడి మాట్లాడాల్సి వస్తది. మన సమాజం భిన్న సంస్కృతో కూడుకున్నది. పరిపాలించేవాడు ఆలోచన చేసి ఏ వర్గానికి ఏ విధంగా చేస్తే మంచి జరుగుతోందో ఆ విధంగా పాలన చేయాలి. అంతేకానీ ప్రతినిత్యం రాజకీయాలు చేయటం, ప్రతి నిత్యం ఆరోపణలు చేయటం సరైంది కాదు. ఏదో ఒకటి పాదయాత్రల పేరు పెట్టుకొని ఆరోపణలు చేయటం సరికాదు. పాదయాత్రలను తప్పుపట్టటం లేదు. కాకపోతే తెలంగాణ ప్రభుత్వంటే మెరుగ్గా ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి.
Also Read : తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం… షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలంటే., గొప్ప పథకాలు అమలు చేస్తామని చెప్పండి. అంతే కానీ ప్రభుత్వాలను కూలదోయడం, ప్రభుత్వాలను పడగొట్టడం, శాసనసభ్యులను కొనుగోలు చేయటం, ఇదేనా మనకు ప్రజలు రాజకీయాల్లో అవకాశం కల్పించింది. ప్రజలు దీనికోసమే మనకు ఓట్లేశారా ? ఇది కాదు ప్రజాస్వామ్యం. ఒకటే గుర్తు చేస్తున్నా. ఇక్కడ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా. నా నియోజకవర్గం పేరు కూడా వినిపించింది. నేను ఒక్కటే చెబుతున్నా. చావనైనా చస్తాం కానీ.., ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టి పోయేది లేదు. ఇంత మంచి ప్రభుత్వానికి మేం దూరం కాదల్చుకోలేదు. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ప్రభుత్వాలను చూశాను. అనేక మంత్రి ముఖ్యమంత్రులను చూశాను. మంత్రిగా పని చేశాను. టీఆర్ఎస్లో ఉన్న ఏ శాసనసభ్యుడు డబ్బులకు అమ్ముడుపోయే రకం కాదు.
Read Also : ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నేడు కవిత వివరణ… హైదరాబాద్కు చేరుకున్న సీబీఐ అధికారులు
కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ.., ఆయన నిర్ణయాలను గ్రామాల్లో అమలు పరుస్తూ..పని చేస్తాం. అంతే తప్ప ప్రాణం పోయినా సరే.. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే పరిస్థితి ఎవరికీ కలగదు. అది ఊహాజనితం. ప్రభుత్వాలను కూల్చేయాలని మీరు ఆశపడుతున్నారు. ఇది మంచి కార్యక్రమం కాదు. మేం హ్యాపీగా ఉన్నాం. వందల అభివృద్ధి పనులు చేశాం. మాకు పనులు పూర్తి చేయటానికి సమయం దొరకటం లేదు. అనేస సంక్షేమ కార్యక్రమాలు గ్రౌండ్లో ఉన్నాయి. అంత మంచి ప్రభుత్వంలో మేం పనిచేస్తున్నాం. మధ్యలోనే ప్రభుత్వాలను పడగొడతాం, మేం కొంటాం అనేది మంచి పద్ధతి కాదు. మీ చర్యల ద్వారా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. మీకు చేతులెత్తి మెక్కుతున్నా. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం.” అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి :
- ఖమ్మం జిల్లాలో వేప చెట్టు నుంచి పాలు… బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతుందని పూజలు
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సిఎం ప్రత్యేక దృష్టి….ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిఎం దూకుడు
- తెలంగాణ బీజేపీ లీడర్లకు అమిత్ షా క్లాస్!
- రన్నింగ్ బస్సులో డ్రైవర్ కి గుండెపోటు.. స్టీరింగ్ పై కుప్పకూలి మృతి.. ఆ తర్వాత
- గవర్నర్ లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలు….!!!???
3 Comments