

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సిటీ బస్సు రోడ్డుపై వెళ్తుంది. ఇంతలో అకస్మాత్తుగా ఆ బస్సు డ్రైవర్ కి గుండెపోటు వచ్చింది. డ్రైవర్ సీటులోనే అతను కుప్పకూలిపోయాడు. ఆపై బస్సు వాహనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా… బస్సు బీభత్సం సృష్టించడంతో మరొకరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో జరిగింది.
నగరంలో ఓ సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో డ్రైవర్ సీటులోనే మృతి చెందాడు. దీంతో బస్సు అదుపు తప్పి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. అయితే అది సిగ్నల్ ప్రాంతం కావడంతో బస్సు వేగం తక్కువగా ఉంది. సిగ్నల్ దగ్గర ఓ ఈ రిక్షాను ఢీకొని బస్సు ముందుకెళ్లి ఆగిపోయింది.
CAUGHT ON CAMERA – A city bus in Madhya Pradesh's Jabalpur ran into several vehicles, killing 2, after its driver died of sudden heart attack. #Jabalpur #MadhyaPradesh #Accident pic.twitter.com/MvOEq3lbHV
— TIMES NOW (@TimesNow) December 2, 2022
బస్సు ఈ రిక్షాను ఢీకొనడంతో బోల్తా పడింది. రిక్షాలో ఉన్నఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. మరో నలుగురు కూడా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. బస్సు ఢీకొనడంతో వృద్ధుడు గాయపడగా.. ఆయన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ పెద్దాయన మృతి చెందాడు. ఈ ఘటనలో మృతి చెందిన డ్రైవర్ ని హర్దేవ్ పటేల్ గా గుర్తించారు. హర్దేవ్ పటేల్ పదేళ్లుగా సిటీ మెట్రో బస్సు లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో ఆయన స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి …
-
తెలంగాణ బీజేపీ లీడర్లకు అమిత్ షా క్లాస్!
-
కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి…. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఆగ్రహం
-
తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… రాష్ట్రపతి హోదాలో తొలిసారి
-
8వ రోజు కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్ర… కేసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన బండి
-
కొడుకును డాక్టర్ చేస్తే, డాక్టర్ కోడలు గిఫ్ట్గా వచ్చింది… మంత్రి మల్లారెడ్డి ఎమోషన్
One Comment