
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని డాక్టర్ను చేస్తే.. డాక్టర్ కోడలు గిఫ్ట్గా వచ్చిందని, అదే రెడ్డి అమ్మాయితో పెళ్లి చేసి ఉంటే కిట్టి పార్టీలు, పిక్నిక్లు అంటూ తిరిగేదంటూ వ్యాఖ్యానించారు. తన కోడలకు తల్లిదండ్రులు లేరని, ఆమె తనకు మూడో కొడుకులాగా అంటూ మల్లారెడ్డి ఎమోషన్ అయ్యారు. సోమవారం ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు.
Read Also : మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీసులు….
ఈ సందర్భంగా బర్త్డే పార్టీలు, పిక్నిక్లు అంటూ తల్లిదండ్రులే తమ పిల్లలను చెడగొడుతున్నారని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రేమ, ఫ్రెండ్షిప్ లాంటి వాటికి దూరంగా ఉండాలని, కొన్ని సాధించాలంటే కొన్నింటిని వదులుకోవాల్సిందేనని తెలిపారు. తనంత అదృష్టవంతుడు ఎవరూ లేవని, కలలను నిజం చేసుకున్నానంటూ తెలిపారు. భూమి అమ్మి కొడుకుని డాక్టర్ చదువు చదివించానని, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయ్యానని చెప్పారు. తాను ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని, మనస్సులో ఏమీ దాచుకోనని చెప్పారు. ‘మా మెడికల్ కాలేజీల్లో డొనేషన్ సీట్లే లేవు, అన్నీ ఆన్లైన్ అడ్మిషన్లే. ప్రభుత్వమే అడ్మిషన్లు చేస్తుంది. మా బంధువులు అడిగా సీట్లు ఇవ్వం. నా కొడుకు సీటు కావాలన్నా నేను ఇవ్వలేదు. నేను భూమి అమ్మి నా కొడుకును ఎంబీబీఎస్ చేయించా. నాపై ఐటీ దాడులు చేసినా అసలు భయపడలేదు.
Also Read : పాదయాత్రలపై మనసు పారేసుకుంటున్న ప్రతిపక్ష నేతలు… ఎన్నికల మూడ్ లోకి తెలంగాణ
400 మంది ఐటీ అధికారులు వచ్చి వాళ్ల పని వాళ్లు చేసుకుని వెళ్లిపోయారు. ఐటీ దాడుల్లో ఏమీ దొరక్కపోవడంతో అధికారులు నాపై నిరాధారమైన ఆరోపణలు చేసి వెళ్లారు. నేను క్యాసినో నడిపించడం లేదు కాలేజీలు మాత్రమే నడిపిస్తున్నారు. నన్ను కొంతమంది బ్లాక్ మెయిలర్స్ ఇబ్బంది పెట్టారు. మూడు ఎంబీబీఎస్ బ్యాచ్లు రాకుండా ఇబ్బంది పెట్టారు. తుఫాన్లు వచ్చినా తట్టుకునే ధైర్యం నాకు ఇప్పుడు వచ్చింది అన్నీ సాధించాను ఇప్పుడు నాకు ఇక ఎలాంటి కోరికలు లేవు’ అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ‘మెడికల్ కాలేజీలు పెట్టిన తర్వాత ఆరేళ్లు నష్టపోయి ఇబ్బంది పడ్డా. వేరే పార్టీ అని అనుమతి ఇవ్వలేదు. రూ.కోట్లు సంపాదించినా నేను ఇప్పటికీ చిన్న ఇంట్లో ఉంటున్నా. నాది చాలా సింపుల్ లైఫ్. విద్యార్థులు నన్ను ఆదర్శంగా తీసుకోవాలి. కష్టపడితే ఎవరైనా జీవితంలో పైకి ఎదగవచ్చు. ప్రస్తుతం 33 కాలేజీలు నడిపిస్తున్నా. ఎంతోమంది ఇంజినీర్లు, డాక్టర్లను తయారుచేస్తున్నా. నా దగ్గర ఎలాంటి బ్లాక్ మనీ లేదు’ అని మల్లారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం… త్వరలో బస్సుయాత్ర చేయనున్న బండి సంజయ్!!!
- సిబిఐకి కవిత మరో ట్విస్ట్ …. 6న వివరణ ఇవ్వలేనంటూ మరో లేఖ
- రాజాసింగ్ కు బీజేపీ షాక్! గోషామహాల్ బరిలో విక్రమ్ గౌడ్?
- తెలంగాణలో మరోసారి ప్రధాని మోడీ.. కేసీఆర్ కు తీన్మారేనా?
- బీజేపీతో టచ్ లో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వీళ్లేనా?
One Comment